PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్కు పునాది
- ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- కాశీ నుంచి దేశవ్యాప్త ఉద్యమంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nasha Mukt Yuva campaign: డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్కు పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంతో పాటు, సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రారంభించింది. శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 వారాల పాటు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలి
ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘నశా ముక్త్ యువ’ కార్యక్రమం కేవలం వ్యక్తుల కోసం మాత్రమే కాదని, కుటుంబాలు, సమాజం, దేశం కోసం చేపడుతున్న ఉద్యమమని అన్నారు. భారత్ను వికసిత్ భారత్గా మార్చే లక్ష్యంలో ఆరోగ్యవంతమైన యువత కీలక పాత్ర పోషిస్తుందని మోడీ పేర్కొన్నారు. యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని అన్నారు.
Also Read
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
- Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
కాశీ నుంచి దేశవ్యాప్త ఉద్యమంగా..
ఈ కార్యక్రమాన్ని తొలుత గత ఏడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా విస్తరించిన ఉద్యమంగా మారిందన్నారు. కాశీ ఎంపీగా ఈ కార్యక్రమం తన నియోజకవర్గం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని మోడీ పేర్కొన్నారు. శాస్త్రీయ అవగాహనతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా ఈ కార్యక్రమం కలిగి ఉందని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం దేశవ్యాప్తంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఈ ప్రచారంలో భాగస్వాములయ్యాయని ప్రధాని తెలిపారు. కోట్లాది మంది ప్రజల సంక్షేమం కోసం సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నాయని చెప్పారు.
కలిసికట్టుగా పనిచేస్తేనే డ్రగ్స్పై విజయం
మాదకద్రవ్యాల దుర్వినియోగంపై పోరాటాన్ని వ్యక్తిగత ప్రయత్నాలతో మాత్రమే గెలవలేమని ప్రధాని మోడీ అన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే పెద్ద మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారని, తమ పాఠశాలలు, కళాశాలలు, సమాజాల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారని మోడీ తెలిపారు. ఈ యువత తీసుకున్న సంకల్పం రాబోయే 100 వారాల పాటు కొనసాగనున్న దేశవ్యాప్త ప్రచారానికి మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు.
ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు
‘నశా ముక్త్ యువ’ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
వీటిలో:
క్రీడా కార్యక్రమాలు
వాక్థాన్లు
ధ్యాన కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలు
డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు
నాటకాలు
చర్చా వేదికలు
ఆర్ట్ కాంపిటీషన్లు
కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు వంటివి ఉంటాయి.
ఆరోగ్యవంతమైన ప్రజలతోనే అభివృద్ధి చెందిన భారత్
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించగలమని అన్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది వేస్తారని, అలాంటి సమాజమే అభివృద్ధి చెందిన దేశానికి బలమైన ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో యువత సాధికారత ఎంతో ముఖ్యమని మాండవీయ అన్నారు.
2020లోనే డ్రగ్స్ రహిత భారత్కు సంకల్పం
2020 ఆగస్టు 15న ప్రధాని మోడీ భారత్ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు సంకల్పాన్ని ప్రకటించిన విషయాన్ని మాండవీయ గుర్తుచేశారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కార్యక్రమాలు, కార్యాచరణకు అప్పట్లోనే మార్గదర్శకాలు రూపొందించారని తెలిపారు. తాజాగా ప్రారంభమైన ‘నశా ముక్త్ యువ’ ప్రచారం ఆ ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
10 వేలకుపైగా ప్రాంతాల్లో యువత భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థలు, యువజన సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థలు, పరిశ్రమల సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు తదితరులు భాగస్వాములయ్యారు. దేశవ్యాప్తంగా 10,000కుపైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. MY Bharat వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లు, యువజన క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు కూడా ప్రచారంలో భాగమయ్యాయి. అలాగే 125కుపైగా ఆధ్యాత్మిక సంస్థలు వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొన్నాయి.
యువతే మార్పుకు రాయబారులు
డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తమకు మాత్రమే కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు, పాఠశాలలు, కళాశాలలు, స్థానిక సమాజాల్లో కూడా డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేలా యువతను ప్రోత్సహించనున్నారు. ఆరోగ్యవంతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది అనే సందేశంతో ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ దేశవ్యాప్తంగా 100 వారాల పాటు కొనసాగనుంది.
తాజావార్తలు
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!