Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్ముజ్ జలసంధి, ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం ఇస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని అన్నారు. ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రంప్ అన్నారు.
Iran War: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ తహతహలాడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగేందుకు ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయనే నివేదికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ చేతిలో పాకిస్తాన్ను అవమానం తప్పలేదు. పాకిస్తాన్కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. Read…
Iran: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్పై ఒత్తిడి తెచ్చిన అమెరికా, ఇప్పుడు భారత్తో పాటు వివిధ దేశాలు రష్యన్ ఆయిల్ కొనాలని బ్రతిమిలాడుతోందని ఆయన విమర్శించారు.
Fuel Gases: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా మన దేశంలో వంటగ్యాస్ (LPG) భయాలు మొదలయ్యాయి. అవసరం లేకున్నా ప్రజలు సిలిండర్లను బుక్ చేయడం పెరిగింది. మరోవైపు కేంద్రం ఎల్పీజీ ఉత్పత్తిని 30 శాతం మేర పెంచింది. దేశంలో అసలు గ్యాస్, చమురు కొరత లేదని చెబుతున్నప్పటికీ, ప్రజలు పానిక్ అవుతున్నారు. అయితే.. LPG, CNG, PNG, LNG అన్ని వాయువలే కదా, వీటి మధ్య తేడాలు ఏంటి, ఎక్కడ అవసరం…
LPG Production: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రంగ సంక్షోభానికి కారణం కాబోతోంది. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు కీలకమైన ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. పెట్రోల్, LPG వంటి పెట్రోలియం నిల్వలు ప్రస్తుతం దేశంలో సరిపడా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలు రష్యా క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా 70కి పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.
విద్యుత్ సంక్షోభంతో చైనాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇండియాలో కూడా రానుందా…? అనే చర్చ మొదలైంది.. దేశంలో వినియోగిస్తున్న విద్యుత్ లో 70 శాతం విద్యుత్ ని బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. ఇక బొగ్గు ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్రభుత్వ పవర్ ప్లాంట్ లలో గత కొన్ని రోజులుగా బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. దేశంలో 130 కి పైగా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటే వాటిలో 70 కి పైగా…