మధ్యప్రాచ్య సంక్షోభం, తరిగిపోయిన దేశీయ నిల్వలు, తగ్గిన దిగుమతుల కారణంగా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పరిమితంగా ఉన్న ఎల్పీజీని పొదుపు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ కంపెనీలు ఇప్పుడు 14.2 కిలోగ్రాముల సిలిండర్లలో గృహాలకు కేవలం 10 కిలోగ్రాముల ఎల్పీజీని మాత్రమే సరఫరా చేయాలని యోచిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఎల్పీజీని పొదుపు చేయడం, వీలైనన్ని ఎక్కువ గృహాలకు దాని సరఫరాను కొనసాగించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యమని భావిస్తున్నారు.…
PM Modi: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తన అధికారిక నివాసం 7-లోక్ కళ్యాణ్ మార్గ్లో అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువు రంగాల పరిస్థితిపై సమీక్షించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశానికి చమురు, గ్యాస్, ఎరువుల కొరత లేకుండా చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ…
Fuel Update : భారతదేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ , ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) వంటి ఇంధన ఉత్పత్తుల లభ్యతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం , సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశీయంగా ఇంధన సరఫరా గొలుసు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధారణంగా సాగుతోందని ఆయన హామీ ఇచ్చారు. గతంతో పోలిస్తే భారత్ తన క్రూడ్…
India On Russian Oil: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. గత శనివారం ఇజ్రాయిల్-యూఎస్ చేసిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించాడు.
India Russia: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో…
Mega Trade Deal: భారత్ మరో మెగా ట్రేడ్ డీల్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్(ఈయూ), అమెరికాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(FTA) కుదుర్చుకుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో తన మార్కెట్ను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కో-ఆపరేటివ్ కౌన్సిల్(GCC)తో వాణిజ్య ఒప్పందానికి భారత్ చర్చలకు సిద్ధమైంది. ఇది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈయూ, ఆసియాన్, అమెరికా, చైనాల కన్నా పెద్ద మార్కెట్.
India: వెనిజులాపై అమెరికా దాడి తర్వాత జరిగిన తర్వాత ఒక్కసారిగా వెనిజులా చమురు వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం ట్రంప్ అమెరికా.. వెనిజులా నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును స్వీకరిస్తుందని ప్రకటించారు. దీనిని మార్కెట్ ధరలకు విక్రయిస్తారు. భవిష్యత్తులో వెనిజులా చమురు మార్కెట్లోకి ప్రవేశిస్తే, దానిని అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయిస్తారని ఇది సూచిస్తుంది. వెనిజులా చమురుపై అమెరికా పూర్తి నియంత్రణ సాధిస్తే, దాని ధర WTIపై ఆధారపడి ఉండవచ్చు, ఇది ప్రస్తుతం బ్యారెల్కు…
Chabahar Port: భారత్కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టుపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి 6 నెలల మినహాయింపు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.