Chabahar Port: భారత్కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టుపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి 6 నెలల మినహాయింపు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.