Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
- ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో కీలక మలుపు..
- ట్రూడో ఆరోపణలకు ఎదురుదెబ్బ..
- భారత ప్రమేయం లేదని కెనడా పోలీసుల స్పష్టీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nijjar killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య దౌత్యవివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 2023లో సర్రే ప్రాంతంలో ఇతను హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ టూడో సంచలన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. కెనడా ఆరోపణలకు అంతే ధీటుగా భారత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లకు కెనడా ప్రధాన స్థావరంగా మారిందని విమర్శించింది.
ఈ నేపథ్యంలో, ఈ హత్యపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ లిసా మోర్లాండ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో భారత ప్రభుత్వ అధికారులను ఈ కేసుతో అనుసంధానించే ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అయితే భారత ప్రభుత్వం కూడా ఈ విచారణకు సహకరిస్తోందని వెల్లడించారు.
Also Read
- Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
మరోవైపు, అమెరికా న్యాయశాఖ తాజాగా ‘‘ఆపరేషన్ హార్డ్ బాల్’’ కింద దాఖలు చేసిన చార్జ్షీట్లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణఓయ్, అతడి అనుచరుడు గోల్డీ బ్రార్ తదితరులపై నిజ్జర్ హత్యకు సంబంధించిన ఆరోపణలు నమోదు చేసింది. ఈ చార్జిషీట్లో కూడా భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని ఎక్కడ పేర్కొనలేదు.
నిజ్జర్ ఎవరు?
హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరుడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)కు అధినేతగా ఉన్నాడు. 2020లో ఇతడిని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2023లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల కారణంగా ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గురు పత్వంత్ సింగ్ పన్నూ వంటి కరడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, నిజ్జర్కు మద్దతుగా నిలిచారు. ఇక జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-కెనడా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, రామ్చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!