Operation Indravati: గ్యాంగ్ వార్తో కల్లోలంగా మారిన హైతీ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం ‘‘ఆపరేషన్ ఇంద్రావతి’’ని ప్రారంభించింది. కరేబియన్ దేశమైన హైతీలో సాయుధ ముఠాలు అక్కడి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్న భారతీయులను సమీపంలో డొమినికన్ రిపబ్లిక్కి తరలించేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
Haiti: కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.