Gulam Nabi Azad: పది రోజుల్లో పార్టీ ప్రకటన.. అది ఎవరి వల్లా కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulam Nabi Azad Interesting Comments On Article 370: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. మరో పది రోజుల్లోనే తన కొత్త పార్టీని ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం జమ్ము కశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో.. ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే తనపై వచ్చిన విమర్శల మీద స్పందస్తూ.. ‘‘నా మీద కాంగ్రెస్ నేతలు మిసైళ్లు విసిరారు. నేను కేవలం 303 రైఫిల్ మాత్రమే ఉపయోగించా. ఆ దెబ్బకు వాళ్ల మిసైల్సన్నీ ధ్వంసమయ్యాయి. ఒకవేళ నేను బాలిస్టిక్ మిసైల్ వినియోగించి ఉంటే, వారి పరిస్థితేంటి? బహుశా ఎవరూ ఈపాటికి కనిపించకపోయేవారు’’ అని కౌంటర్లు వేశారు.
ఇదే సమయంలో.. రెండేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్ముకశ్మీర్కు లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని మళ్లీ సాధించుకోవడం అసాధ్యమని అన్నారు. స్థానిక రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని మభ్యపెడుతున్నాయని, కానీ తాను మాత్రం అందరిలా మభ్యపెట్టలేనని అన్నారు. ఓట్ల కోసం కశ్మీర్ ప్రజల్ని తాను మోసం చేయలేనని, కేవలం వాస్తవాలు మాత్రమే చెప్తానన్నారు. ఆర్టికల్ 370ని తీసుకురావడమన్నది సాధ్యం కాని విషయమని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలంటే.. పార్లమెంటులో టూ థర్డ్ మెజార్టీని సాధించాల్సి ఉంటుందని, అయితే అధి అసాధ్యమని వెల్లడించారు. బీజేపీని కాదని, ఆర్టికల్ 370కి అనుకూలంగా మెజార్టీని సాధించే పార్టీ దేశంలో ఏదీ లేదని గులాం నబీ ఆజాద్ ఉధ్ఘాటించారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
జమ్ముకశ్మీర్ను మొఘలులు 800 ఏళ్లు పాలించారని, బ్రిటిష్ వారు 300 ఏళ్లు పాలించారని.. అయితే ఇప్పటికీ జమ్ముకశ్మీర్లో వేలాది మంది పాలకులు, ఆక్రమణదారులు ఉన్నారంటూ స్థానిక రాజకీయ పార్టీలను గులాంనబీ ఆజాద్ టార్గెట్ చేశారు. అందరూ జమ్ము కశ్మీర్ను దోచుకున్నారన్నారు. తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇంకా పేరు నిర్ణయించలేదని.. ప్రజలే తన పార్టీ పేరుతో పాటు జెండా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తన పార్టీ పేరును ప్రకటిస్తానన్నారు. జమ్ముకశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంతో పాటు స్థానిక ప్రజల ఉద్యోగ, భూమి హక్కులను కాపాడాలన్న ఎజెండా విషయంలో తమ పార్టీ స్పష్టంగా ఉందని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!