Gulam Nabi Azad: పది రోజుల్లో పార్టీ ప్రకటన.. అది ఎవరి వల్లా కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulam Nabi Azad Interesting Comments On Article 370: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. మరో పది రోజుల్లోనే తన కొత్త పార్టీని ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం జమ్ము కశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో.. ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే తనపై వచ్చిన విమర్శల మీద స్పందస్తూ.. ‘‘నా మీద కాంగ్రెస్ నేతలు మిసైళ్లు విసిరారు. నేను కేవలం 303 రైఫిల్ మాత్రమే ఉపయోగించా. ఆ దెబ్బకు వాళ్ల మిసైల్సన్నీ ధ్వంసమయ్యాయి. ఒకవేళ నేను బాలిస్టిక్ మిసైల్ వినియోగించి ఉంటే, వారి పరిస్థితేంటి? బహుశా ఎవరూ ఈపాటికి కనిపించకపోయేవారు’’ అని కౌంటర్లు వేశారు.
ఇదే సమయంలో.. రెండేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్ముకశ్మీర్కు లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని మళ్లీ సాధించుకోవడం అసాధ్యమని అన్నారు. స్థానిక రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని మభ్యపెడుతున్నాయని, కానీ తాను మాత్రం అందరిలా మభ్యపెట్టలేనని అన్నారు. ఓట్ల కోసం కశ్మీర్ ప్రజల్ని తాను మోసం చేయలేనని, కేవలం వాస్తవాలు మాత్రమే చెప్తానన్నారు. ఆర్టికల్ 370ని తీసుకురావడమన్నది సాధ్యం కాని విషయమని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలంటే.. పార్లమెంటులో టూ థర్డ్ మెజార్టీని సాధించాల్సి ఉంటుందని, అయితే అధి అసాధ్యమని వెల్లడించారు. బీజేపీని కాదని, ఆర్టికల్ 370కి అనుకూలంగా మెజార్టీని సాధించే పార్టీ దేశంలో ఏదీ లేదని గులాం నబీ ఆజాద్ ఉధ్ఘాటించారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
జమ్ముకశ్మీర్ను మొఘలులు 800 ఏళ్లు పాలించారని, బ్రిటిష్ వారు 300 ఏళ్లు పాలించారని.. అయితే ఇప్పటికీ జమ్ముకశ్మీర్లో వేలాది మంది పాలకులు, ఆక్రమణదారులు ఉన్నారంటూ స్థానిక రాజకీయ పార్టీలను గులాంనబీ ఆజాద్ టార్గెట్ చేశారు. అందరూ జమ్ము కశ్మీర్ను దోచుకున్నారన్నారు. తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇంకా పేరు నిర్ణయించలేదని.. ప్రజలే తన పార్టీ పేరుతో పాటు జెండా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తన పార్టీ పేరును ప్రకటిస్తానన్నారు. జమ్ముకశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంతో పాటు స్థానిక ప్రజల ఉద్యోగ, భూమి హక్కులను కాపాడాలన్న ఎజెండా విషయంలో తమ పార్టీ స్పష్టంగా ఉందని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!