Good News: ప్రైవేట్ ఉద్యోగులకు తీపికబురు.. భారీ స్థాయిలో ఇంక్రిమెంట్లు
కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది.
మరోవైపు బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్లోనే అధికంగా పెంపు ఉంటుందని సర్వే అంచనా వేసింది. ఈ మేరకు భారత్లో 9.9 శాతం, రష్యాలో 6.1 శాతం, చైనాలో 6 శాతం, బ్రెజిల్లో 5 శాతం మాత్రమే వేతనాల పెంపు ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. ఈ సర్వే కోసం 40 వేర్వేరు రంగాల నుంచి 1500 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, లైఫ్ సైన్సెస్ రంగంలో వేతనాల పెంపు అధికంగా ఉండనున్నట్లు అయాన్స్ సంస్థ సర్వే తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!