CM Yogi Adityanath: కాంగ్రెస్పై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించిందని ఆరోపించారు. కర్ణాటకలో 4 శాతం ముస్లిం కోటాపై మాట్లాడుతూ, ఇది బాబా సాహెబ్ అంబేద్కర్కి తీవ్ర అవమానం అని అన్నారు.
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ మద్దతు ఉన్న ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (OSF) సంస్థతో పాటు బెంగళూరులోని కొన్ని అనుబంధ సంస్థలలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద జరుగుతున్నాయని, ఓఎస్ఎఫ్ తో పాటు కొన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయని అధికారులు…
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.
Giorgia Meloni: బిలియనీర్ జార్జ్ సోరోస్ విదేశాల రాజకీయాల్లో జోక్యానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇత దేశాల రాజకీయాల్లో కలుగుజేసుకుంటున్నారని ఆమె అన్నారు. దేశాలను అస్థిరపరచడానికి తన డబ్బును ఉపయోగిస్తున్నారని మెలోనీ గురువారం అన్నారు. యూరప్ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్న తరుణంలో మెలోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో యూరప్లో రాజకీయాల…
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రియాక్ట్ అయ్యారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై మండిపడుతున్నాయన్నారు. పలు సందర్భాల్లో ఇటలీ, ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని తెలిపింది.
USA: సోలార్ ప్రాజెక్టుల వ్యవహారంలో లంచాలు ఇచ్చాడని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా అభియోగాలు మోపింది. అయితే, అమెరికా రిపబ్లికన్ లా మేకర్ లాన్స్ గూడెన్ అదానీకి మద్దతుగా నిలిచారు. బైడెన్ తన పదవి నుంచి దిగిపోయే సమయంలో, మిత్రదేశాల మధ్య సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
George Soros: బిలియనీర్ జార్జ్ సోరోస్ని ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’తో గౌరవించాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్ బహిరంగంగా విమర్శించారు. ‘‘బైడెన్ సోరోస్కి ప్రెసిడెన్షియల్ మెడల్ని ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఒక విడ్డూరం’’ అని మస్క్ విమర్శించారు.
అమెరికాలో 2009లో ఏర్పాటు చేసిన డిన్నర్ కు ఆహ్వానితుల జాబితాలో జార్జ్ సోరోస్ పేరును కాంగ్రెస్ ఎంపీ, నాటి విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్ చేర్చారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
Loksabha: పార్లమెంట్ లో ఈరోజు (డిసెంబర్ 12) కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన బాట పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.
M Jethamalani: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది.