Jagadish Shettar: ఈ రోజు కాంగ్రెస్లో చేరనున్న బీజేపీ నేత జగదీష్ షెట్టర్.. ఎన్నికల ముందు కీలక పరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Shettar: బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు(సోమవారం) ఉదయం ఆయన బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి వైదొలిగిన కొద్ధి సేపటికే కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బెంగళూర్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్దరామయ్యతో శెట్టర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలను కలిసేందుకు హుబ్బళ్లి నుంచి బెంగళూర్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ఎలాంటి డిమాండ్లు లేకుండా, కేవలం పార్టీ సిద్ధాంతాలు నచ్చే జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. దేశాన్ని కలిపి ఉంచేందుకు కాంగ్రెస్ పనిచేస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే పార్టీని కాదని షెట్టర్ తన లాభాన్ని చూసుకోవడానికి బయటకు వెళ్లారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్ప ఆరోపించారు. పార్టీ ఢిల్లీలో కీలక పదవులు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదని ఆయన అన్నారు. హోం మంత్రి అమిత్ షా జగదీష్ షెట్టర్ తో వ్యక్తిగతంగా మాట్లాడారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. లింగాయత్ వర్గానికి అత్యధికం మంత్రి పదువులు ఇచ్చింది బీజేపీ అని బొమ్మై అన్నారు.
లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్ను ఓడించి 21,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్ సవాది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామాలు కొంత ఇబ్బందిగా మారాయి. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!