Jagadish Shettar: ఈ రోజు కాంగ్రెస్లో చేరనున్న బీజేపీ నేత జగదీష్ షెట్టర్.. ఎన్నికల ముందు కీలక పరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Shettar: బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు(సోమవారం) ఉదయం ఆయన బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి వైదొలిగిన కొద్ధి సేపటికే కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బెంగళూర్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్దరామయ్యతో శెట్టర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలను కలిసేందుకు హుబ్బళ్లి నుంచి బెంగళూర్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు.
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ఎలాంటి డిమాండ్లు లేకుండా, కేవలం పార్టీ సిద్ధాంతాలు నచ్చే జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. దేశాన్ని కలిపి ఉంచేందుకు కాంగ్రెస్ పనిచేస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే పార్టీని కాదని షెట్టర్ తన లాభాన్ని చూసుకోవడానికి బయటకు వెళ్లారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్ప ఆరోపించారు. పార్టీ ఢిల్లీలో కీలక పదవులు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదని ఆయన అన్నారు. హోం మంత్రి అమిత్ షా జగదీష్ షెట్టర్ తో వ్యక్తిగతంగా మాట్లాడారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. లింగాయత్ వర్గానికి అత్యధికం మంత్రి పదువులు ఇచ్చింది బీజేపీ అని బొమ్మై అన్నారు.
లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్ను ఓడించి 21,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్ సవాది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామాలు కొంత ఇబ్బందిగా మారాయి. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!