Rajiv Gandhi Foundation: సోనియాగాంధీకి బిగ్ షాక్.. రెండు ఎన్జీవోల లైసెన్సులు రద్దు.. సీబీఐ దర్యాప్తుకు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foreign Funding Licence Of Gandhis NGOs Cancelled: గాంధీ కుటుంబానికి చెందిన రెండు ఎన్జీవోలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)ల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద కేంద్రం ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకుంది. ఈ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరో కేసులో గాంధీ కుటుంబం బుక్ అయింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆర్జీఎఫ్ కు చీఫ్ గా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాలు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సభ్యులుగా ఉన్నారు. ఆర్జీసీటీకి సోనియాగాంధీ చైర్పర్సన్గా ఉండగా.. రాహుల్ గాంధీ, రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ ఎస్. గంగూలీ సభ్యులుగా ఉన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ఈ రెండు ఎన్జీవోల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు 2020లో హో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ కమిటీ విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
Also Read
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో పత్రాలను తారుమారు చేయడంతో పాటు, నిధుల దుర్వినియోగం, చైనాతో సహా ఇతర విదేశాల నుంచి నిధులు పొందుతున్న సమయంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ఎన్జీవోలు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ విచారించే అవకాశం కనిపిస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రెండు సంస్థలు 2005-09 మధ్య చైనా నుంచి నిధులు తీసుకున్నట్లు ఆరోపించారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్జీఎఫ్ కి నిధులు అందాయని.. దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మోహుల్ చోక్సీ నుంచి కూడా వీటిని నిధులు అందాయని నడ్డా ఆరోపించారు. చైనా-ఇండియా మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కోసం లాబీయింగ్ చేయడానికి ఆర్జీఎఫ్ కు నిధులను చైనా లంచంగా ఇచ్చిందనే ఆరోపణలను చేసింది బీజేపీ.
తాజావార్తలు
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!