Rajiv Gandhi Foundation: సోనియాగాంధీకి బిగ్ షాక్.. రెండు ఎన్జీవోల లైసెన్సులు రద్దు.. సీబీఐ దర్యాప్తుకు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foreign Funding Licence Of Gandhis NGOs Cancelled: గాంధీ కుటుంబానికి చెందిన రెండు ఎన్జీవోలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)ల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద కేంద్రం ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకుంది. ఈ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరో కేసులో గాంధీ కుటుంబం బుక్ అయింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆర్జీఎఫ్ కు చీఫ్ గా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాలు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సభ్యులుగా ఉన్నారు. ఆర్జీసీటీకి సోనియాగాంధీ చైర్పర్సన్గా ఉండగా.. రాహుల్ గాంధీ, రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ ఎస్. గంగూలీ సభ్యులుగా ఉన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ఈ రెండు ఎన్జీవోల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు 2020లో హో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ కమిటీ విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో పత్రాలను తారుమారు చేయడంతో పాటు, నిధుల దుర్వినియోగం, చైనాతో సహా ఇతర విదేశాల నుంచి నిధులు పొందుతున్న సమయంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ఎన్జీవోలు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ విచారించే అవకాశం కనిపిస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రెండు సంస్థలు 2005-09 మధ్య చైనా నుంచి నిధులు తీసుకున్నట్లు ఆరోపించారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్జీఎఫ్ కి నిధులు అందాయని.. దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మోహుల్ చోక్సీ నుంచి కూడా వీటిని నిధులు అందాయని నడ్డా ఆరోపించారు. చైనా-ఇండియా మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కోసం లాబీయింగ్ చేయడానికి ఆర్జీఎఫ్ కు నిధులను చైనా లంచంగా ఇచ్చిందనే ఆరోపణలను చేసింది బీజేపీ.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!