Sanjay Nirupam: మహారాష్ట్రలో కీలక పరిణామం.. శివసేనలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Nirupam: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని ఇటీవల కాంగ్రెస్ తన పార్టీకి చెందిన కీలక నేత సంజయ్ నిరుపమ్ని బహిష్కరించింది. శుక్రవారం ఆయన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. 19 ఏళ్ల క్రితం బాల్ థాకరే నేతృత్వంలోని శివసేను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరిన ఆయన సొంతగూటికి తిరిగి వచ్చారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని చెబుతూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. శివసేనలో చేరిన సంజయ్ నిరుపమ్కి శివసేన డిప్యూటీ లీడర్, అధికార ప్రతినిధి బాధ్యతల్ని సీఎం ఏక్నాథ్ షిండే అప్పగించారు.
Read Also: Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ నన్ను చంపడమే మిగిలింది.. మాజీ ప్రధాని సంచలనం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
సంజయ్ నిరుపమ్ తన భార్య, కూతురితో కలిసి శివసేనలో చేరారు. శివసేనలో చేరడం సొంతింటికి తిరిగి రావడం లాంటిదని అన్నారు. నేను కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మీకందరికి తెలుసని మీడియాతో అన్నారు. 1996లో బాల్ థాకరే నిరుపమ్ని రాజ్యసభకు పంపారు. అయితే, 2005లో రాజ్యసభకు పదవీ విరమణ చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి మారారు. 2005లో కాంగ్రెస్లో చేరిన ఆయన మహారాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సీటులో విజయం సాధించారు. బీజేపీ నేత రామ్ నాయక్ని ఓడించారు.
ఇటీవల ముంబై నార్త్-వెస్ట్ సీటు కోసం నిరుపమ్ పార్టీకి అల్టిమేటం జారీ చేయడంతో అతడిని కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ సీటు నుంచి పోటీ చేయాలని నిరుపమ్ భావించినప్పటికీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ దీనిని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)కి కేటాయింది. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్-ఎన్సీపీతో పొత్తును కూడా ఆయన వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి గెలుపు కోసం నిరుపమ్ పనిచేస్తారని సీఎం ఏక్నాథ్ షిండే చేరిక సమయంలో అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!