Sanjay Nirupam: మహారాష్ట్రలో కీలక పరిణామం.. శివసేనలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Nirupam: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని ఇటీవల కాంగ్రెస్ తన పార్టీకి చెందిన కీలక నేత సంజయ్ నిరుపమ్ని బహిష్కరించింది. శుక్రవారం ఆయన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. 19 ఏళ్ల క్రితం బాల్ థాకరే నేతృత్వంలోని శివసేను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరిన ఆయన సొంతగూటికి తిరిగి వచ్చారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని చెబుతూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. శివసేనలో చేరిన సంజయ్ నిరుపమ్కి శివసేన డిప్యూటీ లీడర్, అధికార ప్రతినిధి బాధ్యతల్ని సీఎం ఏక్నాథ్ షిండే అప్పగించారు.
Read Also: Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ నన్ను చంపడమే మిగిలింది.. మాజీ ప్రధాని సంచలనం..
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
సంజయ్ నిరుపమ్ తన భార్య, కూతురితో కలిసి శివసేనలో చేరారు. శివసేనలో చేరడం సొంతింటికి తిరిగి రావడం లాంటిదని అన్నారు. నేను కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మీకందరికి తెలుసని మీడియాతో అన్నారు. 1996లో బాల్ థాకరే నిరుపమ్ని రాజ్యసభకు పంపారు. అయితే, 2005లో రాజ్యసభకు పదవీ విరమణ చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి మారారు. 2005లో కాంగ్రెస్లో చేరిన ఆయన మహారాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సీటులో విజయం సాధించారు. బీజేపీ నేత రామ్ నాయక్ని ఓడించారు.
ఇటీవల ముంబై నార్త్-వెస్ట్ సీటు కోసం నిరుపమ్ పార్టీకి అల్టిమేటం జారీ చేయడంతో అతడిని కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ సీటు నుంచి పోటీ చేయాలని నిరుపమ్ భావించినప్పటికీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ దీనిని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)కి కేటాయింది. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్-ఎన్సీపీతో పొత్తును కూడా ఆయన వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి గెలుపు కోసం నిరుపమ్ పనిచేస్తారని సీఎం ఏక్నాథ్ షిండే చేరిక సమయంలో అన్నారు.
తాజావార్తలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!