Supreme Court: ‘‘మీరు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లా..?’’ కేఏ పాల్ పిటిషన్పై ఆగ్రహం..
- మీరు ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లా..?
- బ్యాలెట్ పేపర్ల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- కేఏ పాల్ పిటిషన్ కొట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్ని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలాలే ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఈవీఎం ట్యాపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తాయా… అని ప్రశ్నించింది. ‘‘మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఈవీఎం ట్యాపరింగ్ కావు. మీరు ఓడిపోయినప్పుడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడుతాయా’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బ్యాలెట్ పేపర్ని మళ్లీ ప్రవేశపెట్టడం తప్పని సరి అని, ఈవీఎం ట్యాంపరింగ్కి గురయ్యే అవకాశం ఉందని పిటిషన్ కేఏ పాల్ తన పిటిషన్లో తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారని ఆయన పేర్కొన్నాడు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే ఎలాన్ మస్క్ వాదనని కేఏ పాల్ ఉదహరించారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ‘‘అగౌరవించారు’’.. బీజేపీ ఆరోపణ..
దీనిపై ధర్మాసనం..‘‘ చంద్రబాబు నాయుడు, జగన్ మోమన్ రెడ్డి ఓడిపోయినప్పుడు వారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగనట్టు చెబుతారు, గెలిచినప్పుడు ఏమీ అనరు.దీనిని మేం ఎలా చూడాలి..? మేము దీనిని కొట్టివేస్తున్నాము’’ అని జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. మీరు వీటన్నింటిని వాదించేది ఇక్కడ కాదు అని చెప్పారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువులను పంపిణీ చేసినందుకు దోషులుగా తేలితే కనీసం ఐదేళ్లపాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని భారత ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలని పాల్ కోర్టును అభ్యర్థించారు. మీకు ఇంట్రెస్టింగ్ పిల్స్ ఉన్నాయి..? ఈ అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి..? అని కోర్టు ప్రశ్నించింది.
అనాథలను, వితంతువులను రక్షించే సంస్థకు తాను అధ్యక్షుడినని పాల్ చెప్పినప్పుడు, మీరు ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారు..? ఈ రాజకీయాలు మీకు చాలా భిన్నమైనవని కోర్టు చెప్పింది. పిటిషనర్ కే ఏ పాల్ తాను 150 దేశాలకు వెళ్లాలని ధర్మాసనం ముందు చెప్పినప్పడు.. ఆ దేశాలు ఈవీఎం లేదా బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తున్నాయా..? అని కోర్టు ప్రశ్నించింది. అనేక దేశాలు బ్యాలెట్ పేపర్లనే ఉపయోగిస్తున్నాయని పిటిషనర్ సమాధానం ఇచ్చారు. ‘‘మీరు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి ఎందుకు భిన్నంగా ఉందకూడదనుకుంటున్నారు..? అని కోర్టు ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మంగళవారం ఈవీఎంలపై విమర్శలు చేస్తూ, బ్యాలెట్ పేపర్లను వాడాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!