Olive Ridley Turtles: 33 ఏళ్ల తర్వాత ఒడిశా బీచ్లో కనిపించిన అంతరించిపోతున్న తాబేళ్లు..
- 33 ఏళ్ల తర్వాత ఒడిశా బీచ్లో కనిపించిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Olive Ridley Turtles: అంతరించిపోతున్న అరుదైన ‘‘ఆలీవ్ రిడ్లీ’’ తాబేళ్లు కనిపించాయి. 33 ఏళ్ల తర్వాత ఒడిశాలోని బీచ్కి వచ్చాయి. సామూహిక గూడు కోసం ఒడిశాలోని గహిర్మాత సముద్ర అభయారణ్యంలోని ఎకాకులనాసి ద్వీపంలో కనిపించినట్లు ఒక అధికారి తెలిపారు. ‘‘ ఈ ద్వీపంలోని అందమైన బీచ్ సముద్ర కోతకు గురైంది. దీని ఫలితంగా బీచ్ ప్రొఫైల్ తగ్గింది. అయితే, 2020 నుంచి బీచ్ మళ్లీ స్థిరీకరణకు గురైంది. దీంతో బీచ్ ప్రస్తుతం పొడవుగా మారింది. ఇది తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనుకూలంగా మారింది’’ అని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మానస్ దాస్ అన్నారు. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు చివరిసారిగా 1992లో ఈ బీచ్లో కనిపించాయని, ఇప్పుడు 3 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చాయిన దాస్ అన్నారు.
Read Also: IND vs NZ Finals: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బౌలింగ్ చేయనున్న భారత్
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
ఇటీవల కాలంలో ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తాబేళ్ల సంరక్షణకు చాలా చర్యలు తీసుకుంది. గతంలో 4 కి.మీ పొడవనున్న ఏకాకులనాసి బీచ్, ఇప్పుడు సహజ అక్రెషన్ ప్రక్రియ తర్వాత 8 కి.మీ కు విస్తరించింది. గత రెండు రోజుల్లో 1.7 లక్షల తాబేళ్లకు ఈ బీచ్ ఆతిథ్యం ఇచ్చిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. నాసి-2 బీచ్ కాకుండా, ఈ బీచ్ తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశంగా మారింది. నాసి-2 బీచ్లో 2.63 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి గుంతలు తవ్వాయి.
ఒడిశా తీరం వెంబడి ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రతీ ఏడాది గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి. కేంద్రపారా జిల్లాలోని గహిర్మాత బీచ్ ఈ తాబేళ్లకు ప్రపంచంలోనే ఆతిథ్యం ఇచ్చే అతిపెద్ద బీచ్గా పేరు సంపాదించుకుంది. గహిర్మాత కాకుండా, ఈ తాబేళ్లు రుషికుల్య నది ముఖద్వారా, దేవీ నది ముఖద్వారం వద్ద సామూహిక గూడు కట్టుకోవడానికి వస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత, తాబేళ్లు సముద్ర జలాల్లోకి వెళ్తుంటాయి. 45-50 రోజుల తర్వాత ఈ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!