Akhilesh Yadav: అసద్ అహ్మద్ది బూటకపు ఎన్కౌంటర్.. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత ఫిబ్రవరిలో చంపేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్ కొడుక అసద్ అహ్మద్, అతని అనుచరుడు గులాం కీలక నిందితులుగా ఉన్నారు. వీరిద్దరు ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఝాన్సీ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో యూపీ ఎస్టీఎఫ్ టీం చేతిలో హతమయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ఎస్టీఎఫ్ తో పాటు పోలీస్ అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు కూడా యోగీని కొనియాడుతున్నారు. తమ కొడుకుకు న్యాయం చేశారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం ఎన్ కౌంటర్ ను తప్పుబడుతున్నారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని వ్యాఖ్యానించారు. అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తప్పుడు ఎన్ కౌంటర్లు చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చుతోందని, కోర్టులను బీజేపీ ఏమాత్రం నమ్మడం లేదని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. దోషులను విడిచిపెట్టకూడదు, ఏది ఓప్పో, ఏది తప్పో నిర్ణయించే హక్కు బీజేపీకి లేని అన్నారు.
Also Read
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
Read Also: Yogi Adityanath: అతిక్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్.. ఎస్టీఎఫ్ టీంపై సీఎం ప్రశంసలు.. అత్యవసర సమావేశం..
ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. డిప్యూటీ ఎస్పీ నవేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్కౌంటర్లో మరణించాడు. నిందితుడు అసద్ తండ్రి అతీక్ అహ్మద్ ను ప్రయాగ్ రాజ్ కోర్టులో ప్రవేశపెట్టిన రోజే ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా స్పందించారు. ఈ రోజు పోలీస్ ఎన్ కౌంటర్ లో అతిక్ అహ్మద్ కొడుకు, మరొకరు చనిపోవడంపై చర్యలు జరుగుతన్నాయని, వికాస్ దూబే ఘటన పునరావృతం అవుతుందన్న మా అనుమానం నిజం అయిందని, ఈ ఘటన వెనక పూర్తి నిజం ప్రజల ముందుకు రావాలంటే ఉన్నతస్థాయి విచారణ అవసరమని మాయావతి అన్నారు.
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!