ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో18 మంది మావోయిస్టులు హతం అయ్యారు. అలాగే ఒక జవాను కూడా చనిపోయాడు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఈ ఎదురుగాల్పులు జరిగాయి.
ఇది కూడా చదవండి: Fake Baba: నిమ్మకాయల్లో మత్తమందు.. స్పృహ కోల్పోయాక అత్యాచారం
ఇదిలా ఉంటే నారాయణపూర్ జిల్లా అబుజ్మద్లో మావోలు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడు కారణంగా ఒక జవాన్, ఒక అధికారి కళ్లలోకి దుమ్ము, బురద వెళ్లినట్లుగా తెలిపారు. చికిత్స కోసం వారిని వేరే ప్రాంతానికి తరలించారు.
ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్కు భారతరత్న ఇవ్వాలి.. బెంగాల్ సీఎం డిమాండ్