Fake Baba: నిమ్మకాయల్లో మత్తుమందు.. స్పృహ కోల్పోయాక అత్యాచారం
- మెదక్ జిల్లాలో ఫేక్ బాబా అరెస్ట్
- తెలంగాణ వ్యాప్తంగా బాబా ముసుగులో మహిళలపై అత్యాచారం
- మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న కేటుగాడు
- నిందితుడి నుంచి 2 సెల్ఫోన్లు స్వాధీనం
- దొంగబాబాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba: తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేషధారణలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక దొంగబాబా అరెస్ట్ అయ్యాడు. మెదక్ జిల్లాలో పట్టుబడ్డ ఈ నిందితుడు, తనను “బాపు స్వామి”గా పరిచయం చేసుకుంటూ, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘోర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిందితుడు తనను మహాత్ముడిగా చిత్రీకరించుకుంటూ, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే తాను శక్తివంతమైన పూజలు చేసి నయం చేస్తానని నమ్మించాడు. తనను విశ్వసించిన మహిళలకు ప్రత్యేక పూజల పేరుతో మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు.
దొంగబాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగిస్తాడు. స్పృహ కోల్పోయిన తర్వాత వారి అసహాయ పరిస్థితిని ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అంతేకాదు, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, బాధితులను బెదిరించేవాడు.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
పోలీసులు నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన తాలూకు విచారణలో అనేక మంది బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు, ఇంకా ఎక్కువ వివరాలను వెలికితీయేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇటీవల కాలంలో ఇలాంటి మోసపూరిత వ్యక్తులు, ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ప్రజలు అటువంటి వంచనలకు గురి కాకుండా, ఎవరినైనా తమ అనుభవాలను బయట పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ధర్మం పేరుతో, భక్తిని అడ్డుపెట్టుకుని లాభదోపాలు చూసే వారిపై నిశితంగా పరిశీలన చేయడం అవసరం. ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చే, విశ్వాసాన్ని మోసం చేసే వ్యక్తులను గుర్తించి, సమాజం తమదైన విధంగా బాధితులకు అండగా నిలవాలి. శ్రద్ధతో కాకుండా, సందేహంతో ఆలోచించండి – ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!