West Bengal: కోల్కతాలో ఈడీ దాడులు.. ఓ వ్యాపారి ఇంట్లో బయటపడిన నోట్ల గుట్టలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరుచోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7కోట్ల నగదు బయటపడింది. మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా యాప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టగా.. నోట్ల గుట్టలు బయటపడ్డాయి. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త అమీర్ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. రూ.7కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు.
Dog Attacks: డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్కకాటు.. వీడియో వైరల్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Also Read
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ-నగేట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్తో వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు ఆమిర్ఖాన్తోపాటు మరికొంత మంది పై ఫెడరల్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేను నమోదు చేశారు.గేమింగ్ యాప్ మోసాలకు పాల్పడుతూ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో 2021లో ఈ కంపెనీ, ప్రమోటర్లపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ ప్రమోటర్ ఆమిర్ ఖాన్ నివాసంతో పాటు 6 చోట్ల శనివారం సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యం ఆమిర్ఖాన్ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడగా.. అధికారులు లెక్కింపు మొదలు పెట్టారు. ఇప్పటివరకు అది రూ.7కోట్లుగా తేలింది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ యాప్కు చైనా నియంత్రణలో నడుస్తున్న రుణ యాప్లతో సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!