Priyanka Gandhi: నవంబర్ 13న వయనాడ్ బైపోల్.. ప్రియాంకాగాంధీ పేరు ప్రకటన
- నవంబర్ 13న వయనాడ్ బైపోల్స్
- బరిలోకి దిగుతున్న ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.
ఇది కూడా చదవండి: Bigg Boss: ఛానల్ తో విభేదాలు.. ఇదే నాకు చివరి బిగ్ బాస్ సీజన్.. స్టార్ హీరో కీలక ప్రకటన?
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
వాయనాడ్ లోక్సభ స్థానానికి ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని జూన్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. అన్నట్టుగానే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రియాంక పేరును ప్రకటించారు. ఆమెతో పాటు కేరళలోని మరో రెండు అసెంబ్లీ ఉపఎన్నికలకు అభ్యర్థులను వెల్లడించింది. చెలక్కర, పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు రమ్య హరిదాస్ మరియు రాహుల్ మమ్కూటతిల్ పోటీ చేయనున్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్బరేలీ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే వయనాడ్ వదులుకుని రాయ్బరేలీలో కొనసాగుతున్నారు. దీంతో వయవాడ్ బైపోల్కు మంగళవారం ఈసీ షెడ్యూల్ వెల్లడించారు. నవంబర్ 13న పోలింగ్ జరగగా.. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్ని వెంటాడుతోందా..?
కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానానికి కూడా మంగళవారం ఎన్నికల సంఘం ఉపఎన్నికలు ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఇక జార్ఖండ్లో రెండు విడతల్లో నవంబర్ 13, 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.

తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!