Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్ని వెంటాడుతోందా..?
- కృష్ణజింకలకు బిష్ణోయిలకు మధ్య 500 ఏళ్ల నాటి బంధం..
- తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వర్ రూపాలుగా ఆరాధన..
- కృష్ణజింకల వేటతో సల్మాన్ ఖాన్.. బిష్ణోయిలకు మధ్య వివాదం..
- లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ చేస్తుంది అందుకేనా..?
Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..? దీనికి కారణం, 1998లో ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’ సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్ వెళ్లిన సమయంలో.. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపేశాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్కి మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసు ఉన్న లారెన్స్ బిష్ణోయ్, ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్గా మారి సల్మాన్ ఖాన్ని చంపేస్తానని హెచ్చరిస్తున్నాడు.
Read Also: Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
బిష్ణోయిలు-కృష్ణజింకలకు మధ్య ఎనలేని ప్రేమ:
బిష్ణోయిలు ప్రధానంగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని సాగిస్తుంటారు. వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షిస్తుంటారు. బిష్ణోయిలకు-కృష్ణజింకలది ఇనాటి సంబంధం కాదు. గత 550 ఏళ్లనాటి బంధం. 15 శతాబ్ధంలో గురు జంభేశ్వర్(జంబాజీ) బిష్ణోయ్ కమ్యూనిటీని స్థాపించారు. 29 సూత్రాల ఆధారంగా ఈ తెగ ఏర్పడింది. అతని బోధనలు వన్యప్రాణులు, వృక్ష సంపద సంరక్షణను హైలెట్ చేస్తాయి. బిష్ణోయిలు కృష్ణజింకల్ని తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుడి పునర్జమ్మగా గౌరవిస్తారు. తప్పిపోయిన కృష్ణజింకల్ని, బిష్ణోయి మహిళలు సొంత పిల్లల్లాగే పెంచుతారు. ఇవి కూడా భయం లేకుండా వారి మధ్యే తిరుగుతుంటాయి. మరణించిన తర్వాత బిష్ణోయిలు కృష్ణజింకలుగా పుడుతారనే నమ్మకం వారిది.
చివరకు చెట్లను కాపాడేందుకు కూడా ప్రాణాలు లెక్క చేయని తెగువ బిష్ణోయిలది. 1790లో జోధ్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరకకుండా కాపాడుకునే క్రమంలో 362 మంది బిష్ణోయిలు చంపబడ్డారు. జోధ్పూర్ మహారాజా అభయ్ సింగ్ ఆదేశాల మేరకు ఈ హత్యాకాండ జరిగింది. రాజు కొత్త రాజభవనానికి కలప అవసరం కాగా, చెట్లను నరికివేసేందుకు వచ్చిన వారిని అమృతాదేవీ అనే మహిళ నేతృత్వంలో బిష్ణోయిలు అడ్డుకున్నారు. చెట్లను నరకకుండా కౌగిలించుకున్నారు. ఇప్పటికీ బిష్ణోయి మహిళలు కృష్ణ జింకలకు తమ పాలను ఇస్తుంటారు. అంతలా వీరి మధ్య బంధం ఉంది.
తాజావార్తలు
-
DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!