Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్ని వెంటాడుతోందా..?
- కృష్ణజింకలకు బిష్ణోయిలకు మధ్య 500 ఏళ్ల నాటి బంధం..
- తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వర్ రూపాలుగా ఆరాధన..
- కృష్ణజింకల వేటతో సల్మాన్ ఖాన్.. బిష్ణోయిలకు మధ్య వివాదం..
- లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ చేస్తుంది అందుకేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..? దీనికి కారణం, 1998లో ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’ సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్ వెళ్లిన సమయంలో.. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపేశాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్కి మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసు ఉన్న లారెన్స్ బిష్ణోయ్, ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్గా మారి సల్మాన్ ఖాన్ని చంపేస్తానని హెచ్చరిస్తున్నాడు.
Read Also: Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
బిష్ణోయిలు-కృష్ణజింకలకు మధ్య ఎనలేని ప్రేమ:
బిష్ణోయిలు ప్రధానంగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని సాగిస్తుంటారు. వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షిస్తుంటారు. బిష్ణోయిలకు-కృష్ణజింకలది ఇనాటి సంబంధం కాదు. గత 550 ఏళ్లనాటి బంధం. 15 శతాబ్ధంలో గురు జంభేశ్వర్(జంబాజీ) బిష్ణోయ్ కమ్యూనిటీని స్థాపించారు. 29 సూత్రాల ఆధారంగా ఈ తెగ ఏర్పడింది. అతని బోధనలు వన్యప్రాణులు, వృక్ష సంపద సంరక్షణను హైలెట్ చేస్తాయి. బిష్ణోయిలు కృష్ణజింకల్ని తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుడి పునర్జమ్మగా గౌరవిస్తారు. తప్పిపోయిన కృష్ణజింకల్ని, బిష్ణోయి మహిళలు సొంత పిల్లల్లాగే పెంచుతారు. ఇవి కూడా భయం లేకుండా వారి మధ్యే తిరుగుతుంటాయి. మరణించిన తర్వాత బిష్ణోయిలు కృష్ణజింకలుగా పుడుతారనే నమ్మకం వారిది.
చివరకు చెట్లను కాపాడేందుకు కూడా ప్రాణాలు లెక్క చేయని తెగువ బిష్ణోయిలది. 1790లో జోధ్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరకకుండా కాపాడుకునే క్రమంలో 362 మంది బిష్ణోయిలు చంపబడ్డారు. జోధ్పూర్ మహారాజా అభయ్ సింగ్ ఆదేశాల మేరకు ఈ హత్యాకాండ జరిగింది. రాజు కొత్త రాజభవనానికి కలప అవసరం కాగా, చెట్లను నరికివేసేందుకు వచ్చిన వారిని అమృతాదేవీ అనే మహిళ నేతృత్వంలో బిష్ణోయిలు అడ్డుకున్నారు. చెట్లను నరకకుండా కౌగిలించుకున్నారు. ఇప్పటికీ బిష్ణోయి మహిళలు కృష్ణ జింకలకు తమ పాలను ఇస్తుంటారు. అంతలా వీరి మధ్య బంధం ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?