Donald Trump: “ఐ లవ్ యూ పాకిస్తాన్”.. ఆసిమ్ మునీర్పై ట్రంప్ ప్రశంసలు..
- నేనే యుద్ధాన్ని ఆపాను..
- ఐ లవ్ యూ పాకిస్తాన్..
- ఆసిమ్ మునీర్పై ప్రశంసలు..
- మోడీ అద్భుతమైన వ్యక్తి..
- ట్రంప్ నోటి నుంచి మళ్లీ అదే మాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ వివాదాన్ని తానే ఆపినట్లు చెప్పాడు. భారత్-పాకిస్తాన్ సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే సైనిక చర్య నిలిపేశామని, ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని ప్రధాని మోడీ, ట్రంప్కి తేగేసి చెప్పి కొన్ని గంటలకు అవ్వకముందే మరోసారి ట్రంప్ ‘‘నేనే యుద్ధం ఆపాను’’ అంటూ ప్రకటించుకున్నారు.
Read Also: Story Board: అహ్మదాబాద్ ఘటన తర్వాత తీరు మారలేదా..? ప్లేన్ ఎక్కే ప్రయాణికుడికి భరోసా ఏది..?
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
వైట్హౌజ్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ప్రధాని మోడీ ఒక ‘‘అద్భుతమైన వ్యక్తి’’ అని అభివర్ణించారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని చెప్పారు. ‘‘నేనే యుద్ధాన్ని ఆపాను. నేను పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాను. మోడీ అద్భుతమైన వ్యక్తి అని అనుకుంటున్నాను, నిన్న రాత్రి నేను అతనితో మాట్లాడాను. మేము భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము. నేను పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని ఆపాను’’ అని ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో వైట్ హౌజ్లో చర్చల తర్వాత ట్రంప్ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి యుద్ధం ఆపడంలో ఆసిమ్ మునీర్ చాలా ప్రభావవంతంగా పనిచేశారని ట్రంప్ కొనియారు. భారత్ వైపు నుంచి మోడీ ఈ సంఘర్షణ ఆపేలా పనిచేశారని ట్రంప్ చెప్పారు.
దీనికి ముందు బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్తో దాదాపు 3 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. భారత్ ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ట్రంప్కి స్పష్టం చేశారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి చెప్పారు. మే 7-10 తేదీలలో రెండు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణల తర్వాత అమెరికాతో వాణిజ్యం, భారత్-పాక్ మధ్యవర్తిత్వం గురించి అమెరికా ఎప్పుడూ చర్చించలేదని ప్రధాని ట్రంప్కి స్పష్టం చేసినట్లు తెలిపారు. “పాకిస్తాన్ నుండి వచ్చే ఏ దురాక్రమణ చర్యకైనా బలమైన ప్రతిస్పందన ఉంటుందని భారతదేశం కూడా స్పష్టం చేసింది” అని విదేశాంగ కార్యదర్శి అన్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!