Bihar: హిజాబ్ వివాదం.. విధుల్లో చేరని వైద్యురాలు.. అధికారులు ఏం చేయబోతున్నారంటే..!
- బీహార్లో కొనసాగుతున్న హిజాబ్ వివాదం
- ఇంకా విధుల్లో చేరని వైద్యురాలు
- నేడు విధుల్లో చేరకపోతే రద్దు చేస్తామని వార్నింగ్
- ఇప్పటికే బీహార్ను విడిచి కోల్కతాకు వెళ్లిపోయిన వైద్యురాలు కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో నెలకొన్న హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ వేదికపై నియామక పత్రాలు అందజేశారు. ఆ సందర్భంగా ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వేదికపైకి వచ్చింది. అయితే నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఒక మహిళ హిజాబ్ను ఎలా తొలగిస్తారంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Earthquake: జపాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6 తీవ్రత నమోదు
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ఇదిలా ఉంటే ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న సదరు వైద్యురాలు నుస్రత్ పర్వీన్ ఇప్పటి వరకు విధుల్లో చేరలేదని అధికారులు వెల్లడించారు. అయితే నియామక పత్రాలు అందుకున్న వైద్యులంతా గురువారంలోపు (జనవరి 1) చేరాలని డెడ్లైన్ ఉంది. అది మరికొన్ని గంటల్లో ముగియనుంది. కానీ వైద్యురాలి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఆమె సబల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరాల్సి ఉండగా ఎటువంటి సమాచారం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Peddireddy Ramachandra Reddy: జగన్ మళ్లీ సీఎం అయితేనే ఆ నిజానిజాలు బయటకు వస్తాయి..
అయితే ఈరోజు గనుక విధుల్లో చేరకపోతే ఆమె అపాయింట్మెంట్ను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే హిజాబ్ వివాదం తర్వాత వైద్యురాలి కుటుంబం బీహార్ను విడిచిపెట్టి పశ్చిమ బెంగాల్కు మకాం మార్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆమె విధుల్లో చేరలేనట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!