Karnataka Congress Crisis: 200 శాతం డీకే శివకుమార్ సీఎం అవుతారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం!
- కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం..
- 200 శాతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని డీకేఎస్ వర్గ ఎమ్మెల్యేలు..
- కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయంకాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Congress Crisis: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు బహిర్గతం అయింది. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. నాయకత్వ మార్పు అనివార్యమైతే, డీకేఎస్ తదుపరి సీఎంగా 200 శాతం బాధ్యతలు చేపడతారని ఆయనకు మద్దతిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: India-China: ముమ్మాటికీ అరుణాచల్ మాదే.. చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
Also Read
ఇక, డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు శాసన సభ్యులు తమ డిమాండ్ను కాంగ్రెస్ అధిష్ఠానానికి విన్నవించేందుకు ప్రత్యేకంగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హైకమాండ్కు వారు గుర్తు చేస్తున్నారు. అధికార భాగస్వామ్యంపై గతంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్థానంలో పార్టీ వేరే వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తే, డీకే శివకుమారే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు, ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
Read Also: IND vs SA: లక్ష్యం 549, ప్రస్తుతం 27/2.. భారత్ రోజంతా నిలవగలదా?
అయితే, కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై తుది నిర్ణయం ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే ఉంది. కానీ, ఈ అంశంపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, ఇటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హైకమాండ్ ఇరు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలుస్తుంది. కాగా, కర్ణాటకలో ఏర్పడిన ఈ రాజకీయ ప్రతిష్టంభనపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..