Karnataka Congress Crisis: 200 శాతం డీకే శివకుమార్ సీఎం అవుతారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం!
- కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం..
- 200 శాతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని డీకేఎస్ వర్గ ఎమ్మెల్యేలు..
- కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయంకాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Congress Crisis: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు బహిర్గతం అయింది. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. నాయకత్వ మార్పు అనివార్యమైతే, డీకేఎస్ తదుపరి సీఎంగా 200 శాతం బాధ్యతలు చేపడతారని ఆయనకు మద్దతిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: India-China: ముమ్మాటికీ అరుణాచల్ మాదే.. చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
ఇక, డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు శాసన సభ్యులు తమ డిమాండ్ను కాంగ్రెస్ అధిష్ఠానానికి విన్నవించేందుకు ప్రత్యేకంగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హైకమాండ్కు వారు గుర్తు చేస్తున్నారు. అధికార భాగస్వామ్యంపై గతంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్థానంలో పార్టీ వేరే వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తే, డీకే శివకుమారే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు, ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
Read Also: IND vs SA: లక్ష్యం 549, ప్రస్తుతం 27/2.. భారత్ రోజంతా నిలవగలదా?
అయితే, కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై తుది నిర్ణయం ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే ఉంది. కానీ, ఈ అంశంపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, ఇటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హైకమాండ్ ఇరు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలుస్తుంది. కాగా, కర్ణాటకలో ఏర్పడిన ఈ రాజకీయ ప్రతిష్టంభనపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..