DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి రైతులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
భవిష్యత్తులో కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం అవసరమని డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. దేశంలోని నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకోవాలంటే నదుల అనుసంధానం కీలకమని పేర్కొన్నారు. ఈ దిశగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ అధికారులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ సమస్యలకు పరిష్కారం కనుగొంటామని చెప్పారు. తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునర్నిర్మాణం రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనమని పేర్కొన్న డీకే శివకుమార్, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. అనంతరం “జై కర్ణాటక, జై ఆంధ్ర, జై తెలంగాణ” అంటూ నినాదాలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
కాగా, కర్ణాటక వేదికగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది.. ముగ్గురు ముఖ్యమంత్రులు (చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి) ఒకే వేదికపై చేతులు కలిపారు. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే మాట్లాడిన డీకే శివకుమార్.. తాను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురం కలిపి చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?