కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకుంది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయొద్దంటూ బెంగళూరు వ్యాప్తంగా కర్ణాటక జలసంరక్షణ సమితి, వివిధ రైతుసంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కావేరీ నదీ జలాల వివాదం తెరమీదకు వచ్చింది. అసలు ఈ వివాదం ఏంటి.. ఎప్పుడు ప్రారంభమైందంటే..
కర్ణాటక జల సంరక్షణ సమితి, ఇతర రైతు సంఘాలు మంగళవారం బెంగళూరు బంద్కు పిలుపునిచ్చాయి. తమిళనాడుకు కావేరీ జలాలను కర్ణాటక విడుదల చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బెంగళూరులో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.