Opposition Parties Meetings: బెంగళూరు మీటింగ్లో 6 ప్రధాన అంశాలపై చర్చ.. రేపు సాయంత్రం ఉమ్మడి ప్రెస్ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Parties Meetings: నేడు బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 6 ప్రధాన అంశాలపై 24 పార్టీల నేతలు చర్చించనున్నారు. సమావేశం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వాగతోపన్యాసం చేయనున్నారు. 7 గంటలకు రేపటి సమావేశానికి సంబంధించిన ఎజెండాను ప్రకటిస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీల నేతలకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందును ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభం కానుంది. సమావేశంలో 2024 ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవల్సిన ప్రధానమైన అంశాలపై చర్చిస్తారు. అనంతరం కూటమి ముందుకు సాగడం కోసం వివిధ సబ్ కమిటీలను ఏర్పాటు చేసుకోనున్నారు. వివిధ సబ్ కమిటీను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏర్పాటు చేయనున్నారు. సబ్ కమిటీల ఎన్నిక అనంతరం విపక్షాలను లీడ్ చేయడం కోసం ఒక నేతను కూడా ఈ సమావేశంలోనే ఎన్నుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ముగియనుంది. కూటమి సమావేశం అనంతరం రేపు సాయంత్రం 4 గంటలకు ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ను నిర్వహించనున్నారు.
Read also: Police Harassment: పోలీసుల రాక్షసత్వం.. వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్యాయత్నం
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటుండగా.. నితీశ్కుమార్ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్ (డీఎంకే), హేమంత్సోరెన్ (జేఎంఎం), ఉద్ధవ్ఠాక్రే (ఎస్ఎస్–యుబీటీ), శరద్పవార్ (ఎన్సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), అఖిలేశ్యాదవ్ (ఎస్పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదితరులు పాల్గొంటారు. ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆప్.. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఆదివారం జరిగిన ఆప్ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!