NTV Telugu Site icon

Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి, వారు ఎప్పుడూ జైలుకు వెళ్లరు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…

Digvijaya Singh

Digvijaya Singh

Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్‌ని వ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో నీట్ పేపర్ లీకులపై జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఆర్ఎస్ఎస్ తమకు బద్ధ ప్రత్యర్థి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోంది. వారు మైండ్ గేమ్ ఆడుతారు. వారు ఎప్పుడూ నిరసన చేయరు, ప్రదర్శనలు చేయరు, ఎప్పటికీ వారు లాఠీఛార్జ్‌లను ఎదుర్కోరు, జైళ్లకు వెళ్లరు. కానీ వారు మనల్ని జైలుకి పంపుతారు’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

READ ALSO: AP Weather: కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్షసూచన

అట్టడుగు స్థాయిలో సంస్థాగత నెట్వర్క్ లేకుంటే నిరసనలు ప్రభావంతంగా ఉండవని ఆయన అన్నారు. బూత్ నుంచి జిల్లా వరకు మూడు స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. ‘‘ఆర్ఎస్ఎస్ సాధారణంగా మూడు విషయాలపై దృ‌ష్టిపెడుతుంది. కరపత్రాలను పంపిణీ చేస్తుంది. చర్చలు నిర్వహిస్తుంది. చివరకు ఉద్యమాన్ని నిర్మిస్తుంది. మీరు వారితో పోరాడాలంటే, వారి సొంత ఆటలో వారిని ఓడించాలి. శారీరకంగా కాదు మేధోపరంగా ఆట సాగాలి’’ అని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వహణ మరియు ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ప్రదర్శనపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు. పార్టీ పరాజయానికి కారణాలను విశ్లేషించుకోవాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని బీజేపీ చెప్పగా, అది 250 సీట్లకు కూడా పడిపోయిందని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు వల్లే బీజేపీ మెజారిటీ వచ్చిందని సింగ్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) చైర్‌పర్సన్ ప్రదీప్ కుమార్ జోషిని ఆయన విమర్శించారు, పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.