Maharashtra Next CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్: బీజేపీ
- మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారు: బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్..
- సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న ఏక్ నాథ్ షిండే వర్గం..
- ముంబైలో దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Next CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 210కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా, దీనిపై బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీయే సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి.. మాకు దాదాపు 125 సీట్లు రాబోతున్నాయి.. ఇక, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ చెప్పుకొచ్చారు.
Read Also: Shiv Sena: బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ‘‘ఏక్నాథ్ షిండే’’.. ఉద్ధవ్ని మరిచిన మహా ఓటర్లు..
Also Read
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
కాగా, ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 110 సీట్ల పైగా కైవసం చేసుకోవడంతో.. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిపై వాదన బలంగా వినిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కమలం అధినేతే సీఎంగా కూర్చునే అవకాశం ఉంది. కాగా, ఏక్ నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న షిండే వర్గం తేల్చి చెప్పింది. దీంతో ముంబైలో ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయగా.. పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం పదవిని ఫడ్నవీస్ చేపట్టాలని బీజేపీ నేతల డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Student Suicide: మియాపూర్ లో విద్యార్థి ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు..
అయితే, 2019లో మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56 స్థానాల్లో విజయం సాధించింది. అయితే రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకున్న తర్వాత బీజేపీ, శివసేన మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత మహాకూటమి(కాంగ్రెస్+ఎన్సీపీ)తో జత కట్టిన శివసే మహావికాస్ అఘాడిగా ఏర్పడింది. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అనే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఉద్ధవ్ ఠాక్రే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2022లో షిండే బీజేపీతో జత కట్టడంతో మరోసారి బీజేపీ+ శివసేన(షిండేవర్గం)+ ఎన్సీపీ(పవార్) అధికారంలోకి వచ్చింది. సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు పదవులు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు వైభవ్’.. ఎవరూ ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన సూర్యవంశీ..
-
CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
-
Jagapathi Babu: ఎడిటింగ్లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!