Delhi: అకస్మాత్తుగా ఢిల్లీ వర్సిటీలోకి రాహుల్గాందీ.. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం
- అకస్మాత్తుగా ఢిల్లీ వర్సిటీలోకి రాహుల్గాందీ
- ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ అకస్మాత్తుగా ఢిల్లీ యూనివర్సిటీలోకి వచ్చేశారు. అయితే రాహుల్ రాకపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ పర్యటన కారణంగా విద్యార్థి పాలన కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. అంతేకాకుండా ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించింది. రాహుల్ గాంధీ ఇలా చేయడం ఇది రెండవసారి అని.. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి సమాచారం లేకుండా వస్తున్నారని ప్రొక్టర్ కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. మళ్లీ ఇలా జరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Terror Conspiracy Case: నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
రాహుల్గాంధీ గంటసేపు డీయూఎస్యూ కార్యాలయంలో ఉన్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. దీంతో విద్యార్థులకు తీవ్ర అంతరాయం కలిగిందని వర్సిటీ పేర్కొంది. ఎన్ఎస్యూఐ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. ఇటువంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అయితే ప్రైవేటు అతిథికి ముందుస్తు అనుమతి పొందాలని ఎటువంటి నియమం లేదని విద్యార్థి సంఘం నేత రోనక్ ఖత్రి పేర్కొన్నారు. డీయూఎస్యూ కార్యాలయంలో శాంతియుతంగా కార్యక్రమం జరిగిందని.. ఏ అతిథినైనా ఆహ్వానించే పూర్తి హక్కు విద్యార్థి సంఘానికి ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: US: త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
ఇటీవల బీహార్లో కూడా ఇదే మాదిరిగా రాహుల్గాంధీ వెళ్లే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఏదో విధంగా యూనివర్సిటీలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ‘‘శిక్ష న్యాయ్ సంవాద్’’లో భాగంగా బీహార్లోని దర్భంగా జిల్లాలోని అంబేద్కర్ హాస్టల్లో విద్యార్థులను కలిశారు. అధికారిక అనుమతి లేకుండా జరిగిన కార్యక్రమం కారణంగా రాహుల్గాంధీపై రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోసారి ఢిల్లీ యూనివర్సిటీలోకి రావడంతో కేసులు నమోదు చేస్తామని విశ్వవిద్యాలయం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!