Delhi: అకస్మాత్తుగా ఢిల్లీ వర్సిటీలోకి రాహుల్గాందీ.. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం
- అకస్మాత్తుగా ఢిల్లీ వర్సిటీలోకి రాహుల్గాందీ
- ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ అకస్మాత్తుగా ఢిల్లీ యూనివర్సిటీలోకి వచ్చేశారు. అయితే రాహుల్ రాకపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ పర్యటన కారణంగా విద్యార్థి పాలన కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. అంతేకాకుండా ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించింది. రాహుల్ గాంధీ ఇలా చేయడం ఇది రెండవసారి అని.. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి సమాచారం లేకుండా వస్తున్నారని ప్రొక్టర్ కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. మళ్లీ ఇలా జరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Terror Conspiracy Case: నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
రాహుల్గాంధీ గంటసేపు డీయూఎస్యూ కార్యాలయంలో ఉన్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. దీంతో విద్యార్థులకు తీవ్ర అంతరాయం కలిగిందని వర్సిటీ పేర్కొంది. ఎన్ఎస్యూఐ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. ఇటువంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అయితే ప్రైవేటు అతిథికి ముందుస్తు అనుమతి పొందాలని ఎటువంటి నియమం లేదని విద్యార్థి సంఘం నేత రోనక్ ఖత్రి పేర్కొన్నారు. డీయూఎస్యూ కార్యాలయంలో శాంతియుతంగా కార్యక్రమం జరిగిందని.. ఏ అతిథినైనా ఆహ్వానించే పూర్తి హక్కు విద్యార్థి సంఘానికి ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: US: త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
ఇటీవల బీహార్లో కూడా ఇదే మాదిరిగా రాహుల్గాంధీ వెళ్లే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఏదో విధంగా యూనివర్సిటీలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ‘‘శిక్ష న్యాయ్ సంవాద్’’లో భాగంగా బీహార్లోని దర్భంగా జిల్లాలోని అంబేద్కర్ హాస్టల్లో విద్యార్థులను కలిశారు. అధికారిక అనుమతి లేకుండా జరిగిన కార్యక్రమం కారణంగా రాహుల్గాంధీపై రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోసారి ఢిల్లీ యూనివర్సిటీలోకి రావడంతో కేసులు నమోదు చేస్తామని విశ్వవిద్యాలయం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?