Delhi rain: ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం.. 1936 నాటి రికార్డ్ బ్రేక్
- ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం
- 1936 నాటి స్థాయిలో వర్షం
- రోడ్లు జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు.. వంట సామాగ్రి అన్ని తడిసిముద్దవ్వడంతో ప్రజల పాట్లు వర్ణణాతీతంగా మారాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు లేక నగర వాసులు నానా అవస్థలు పడ్డారు. ఇప్పుడేమో బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు ప్రధాన జంక్షన్ల దగ్గర నీరు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరికొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఇలా నగరంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందం పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. తాగునీటి కోసం నిరాహార దీక్ష చేసిన ఢిల్లీ మంత్రి అతిషి.. ఇప్పుడు నీళ్లు మళ్లించడం కోసం అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఇంతలోనే ఎంత మార్పులు చోటుచేసుకున్నాయి.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు

ఇదిలా ఉంటే ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. 1936లో కురిసిన వర్షం.. మళ్లీ ఇన్నాళ్లకు కురిసినట్లుగా వెల్లడించింది. దాదాపు 88 ఏళ్ల తర్వాత ఇంతటి వర్షం దేశ రాజధానిలో నమోదైనట్లుగా పేర్కొంది. 24 గంటల్లో ఢిల్లీలో 228 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లుగా తెలిపింది.

ఇక ఐటీవో, హనుమాన్ టెంపుల్ ఇంటర్సెక్షన్, మండి హౌస్, అశోకా రోడ్, ఫిరోజ్ షా రోడ్, కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మూల్చంద్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో టెర్మినల్-1 దగ్గర పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఇక కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంఘటనాస్థలిని పరిశీలించి.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!