Delhi rain: ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం.. 1936 నాటి రికార్డ్ బ్రేక్
- ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం
- 1936 నాటి స్థాయిలో వర్షం
- రోడ్లు జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు.. వంట సామాగ్రి అన్ని తడిసిముద్దవ్వడంతో ప్రజల పాట్లు వర్ణణాతీతంగా మారాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు లేక నగర వాసులు నానా అవస్థలు పడ్డారు. ఇప్పుడేమో బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు ప్రధాన జంక్షన్ల దగ్గర నీరు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరికొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఇలా నగరంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందం పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. తాగునీటి కోసం నిరాహార దీక్ష చేసిన ఢిల్లీ మంత్రి అతిషి.. ఇప్పుడు నీళ్లు మళ్లించడం కోసం అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఇంతలోనే ఎంత మార్పులు చోటుచేసుకున్నాయి.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?

ఇదిలా ఉంటే ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. 1936లో కురిసిన వర్షం.. మళ్లీ ఇన్నాళ్లకు కురిసినట్లుగా వెల్లడించింది. దాదాపు 88 ఏళ్ల తర్వాత ఇంతటి వర్షం దేశ రాజధానిలో నమోదైనట్లుగా పేర్కొంది. 24 గంటల్లో ఢిల్లీలో 228 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లుగా తెలిపింది.

ఇక ఐటీవో, హనుమాన్ టెంపుల్ ఇంటర్సెక్షన్, మండి హౌస్, అశోకా రోడ్, ఫిరోజ్ షా రోడ్, కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మూల్చంద్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో టెర్మినల్-1 దగ్గర పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఇక కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంఘటనాస్థలిని పరిశీలించి.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?