దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.