Baba Ramdev: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
- బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
- కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అసలేం జరిగిందంటే..!
ఇటీవల పతంజలి గులాబీ షర్బత్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోను రాందేవ్ విడుదల చేశారు. అందులో కంపెనీ పేరు ప్రస్తావించకుండా ప్రముఖ స్క్వాష్ పానీయం రూహ్ అఫ్జాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీ షర్బత్ అమ్మడం వల్ల వచ్చే డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి ఉపయోగిస్తుందన్నారు. అదే పతంజలి గులాబీ షర్బత్ తాగితే వచ్చే డబ్బును గురుకులాలు, విశ్వవిద్యాలయాలు నిర్మించడానికి ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. లవ్ జిహాద్, ఓటు జిహాద్ లాగానే ప్రస్తుతం షర్బత్ జిహాద్ కూడా జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
అయితే ఈ వీడియో తీవ్ర వివాదంగా మారింది. రూహ్ అఫ్జా తయారీదారు హమ్దార్డ్ కోర్టును ఆశ్రయించారు. రాందేవ్ చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు. దీంతో మంగళవారం పిటిషన్ విచారణకు వచ్చింది. హమ్దార్ద్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇది రూహ్ అఫ్జా ఉత్పత్తిని అగౌరవపరచడమే కాకుండా.. చాలా దిగ్భ్రాంతికరమైన కేసు అని.. అంతేకాకుండా ఇది మత విభజనకు కూడా దారితీస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రామ్దేవ్ వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగం లాంటివని ఆయన అన్నారు. రాందేవ్.. ఇతర ఉత్పత్తిని తక్కువ చేసి చెప్పకుండా పతంజలి ఉత్పత్తులను అమ్మగలరా? అని రోహత్గి ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా రాందేవ్, అతని సహాయకుడు బాలకృష్ణ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారని.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చర్యలను గుర్తుచేశారు. విశేషమేంటంటే అప్పుడు పతంజలి తరపున వాదనలు వినిపించింది రోహత్గి కావడం విశేషం.
ఇక రాందేవ్ తరపున ప్రధాన న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ప్రాక్సీ న్యాయవాది హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం ప్రధాన న్యాయవాది హాజరు కావాలని జస్టిస్ బన్సాల్ ఆదేశించారు. లేకుంటే చర్యగా తీవ్రంగా ఉంటుందని సూచించారు. అనంతరం న్యాయవాది రాజీవ్ నాయర్ కోర్టుకు హాజరై హమ్దార్డ్ ఉత్పత్తికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయితే సోషల్ మీడియా నుంచి వీడియోలు తొలగిస్తున్నట్లు హామీ ఇవ్వాలని ధర్మాసనం కోరింది. వారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. విచారణను మే 1కి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Telangana Inter Results 2025: ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లాలు ఇవే..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!