Baba Ramdev: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
- బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
- కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అసలేం జరిగిందంటే..!
ఇటీవల పతంజలి గులాబీ షర్బత్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోను రాందేవ్ విడుదల చేశారు. అందులో కంపెనీ పేరు ప్రస్తావించకుండా ప్రముఖ స్క్వాష్ పానీయం రూహ్ అఫ్జాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీ షర్బత్ అమ్మడం వల్ల వచ్చే డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి ఉపయోగిస్తుందన్నారు. అదే పతంజలి గులాబీ షర్బత్ తాగితే వచ్చే డబ్బును గురుకులాలు, విశ్వవిద్యాలయాలు నిర్మించడానికి ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. లవ్ జిహాద్, ఓటు జిహాద్ లాగానే ప్రస్తుతం షర్బత్ జిహాద్ కూడా జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
అయితే ఈ వీడియో తీవ్ర వివాదంగా మారింది. రూహ్ అఫ్జా తయారీదారు హమ్దార్డ్ కోర్టును ఆశ్రయించారు. రాందేవ్ చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు. దీంతో మంగళవారం పిటిషన్ విచారణకు వచ్చింది. హమ్దార్ద్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇది రూహ్ అఫ్జా ఉత్పత్తిని అగౌరవపరచడమే కాకుండా.. చాలా దిగ్భ్రాంతికరమైన కేసు అని.. అంతేకాకుండా ఇది మత విభజనకు కూడా దారితీస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రామ్దేవ్ వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగం లాంటివని ఆయన అన్నారు. రాందేవ్.. ఇతర ఉత్పత్తిని తక్కువ చేసి చెప్పకుండా పతంజలి ఉత్పత్తులను అమ్మగలరా? అని రోహత్గి ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా రాందేవ్, అతని సహాయకుడు బాలకృష్ణ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారని.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చర్యలను గుర్తుచేశారు. విశేషమేంటంటే అప్పుడు పతంజలి తరపున వాదనలు వినిపించింది రోహత్గి కావడం విశేషం.
ఇక రాందేవ్ తరపున ప్రధాన న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ప్రాక్సీ న్యాయవాది హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం ప్రధాన న్యాయవాది హాజరు కావాలని జస్టిస్ బన్సాల్ ఆదేశించారు. లేకుంటే చర్యగా తీవ్రంగా ఉంటుందని సూచించారు. అనంతరం న్యాయవాది రాజీవ్ నాయర్ కోర్టుకు హాజరై హమ్దార్డ్ ఉత్పత్తికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయితే సోషల్ మీడియా నుంచి వీడియోలు తొలగిస్తున్నట్లు హామీ ఇవ్వాలని ధర్మాసనం కోరింది. వారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. విచారణను మే 1కి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Telangana Inter Results 2025: ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లాలు ఇవే..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!