Afzal Guru Grave: “అప్జల్ గురు” సమాధిని తొలగించాలని పిల్.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..
- అప్జల్ గురు సమాధిని తొలగించాలని పిల్..
- 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు..? అని ప్రశ్నించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afzal Guru Grave: ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఉగ్రవాదులు అప్జల్ గురు, మక్బూల్ భట్ సమాధులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కింద నమోదైన ఈ పిటిషన్ను కోర్టు బుధవారం కొట్టేసింది. విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ దాఖలు చేసిన పిల్లో సమాధులు ‘తీర్థయాత్ర’ స్థలంగా మారాయని పేర్కొంది. అయితే, ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై డేటాను కోరింది.
Read Also: China New Virus: ఉత్తర కొరియాను వణికిస్తున్న.. చైనా కొత్త వైరస్..!
Also Read
కోర్టు ఈ పిట్ను ఉపసంహరించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే, సాక్ష్యాధారాలతో డేటాతో తిరిగి పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోరింది. వార్తా పత్రిక కథనాలు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో కోర్టు నిర్ణయం తీసుకోదని న్యాయమూర్తులు దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, తుషార్ రావు గెదేలా నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. ‘‘అఫ్జల్ గురును సమాధి చేసి 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు దీన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు?’’ అని కోర్టు పిటిషనర్ని ప్రశ్నించింది. ఈ రెండు సమాధులు తీర్థయాత్ర స్థలాలుగా మారాయనే దానికి కోర్టు భౌతిక ఆధారాలను కోరింది.
2001 డిసెంబర్లో పార్లమెంటుపై దాడిలో తన పాత్రకు దోషిగా తేలి 2013 ఫిబ్రవరిలో అప్జల్ గురును ఉరితీశారు. 1984 ఫిబ్రవరిలో మక్బూల్ భట్కు ఉరి శిక్ష అమలు చేశారు. వీరిద్దరిని జైలు ఆవరణలోనే ఖననం చేశారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, యాకూబ్ మేమన్ వంటి ఉగ్రవాదులను జైలులోనే గోప్యంగా ఖననం చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అదే విధంగా అప్జల్ గురు విషయంలో జరగాలని కోరారు.
తాజావార్తలు
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!