దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్లో 1.56 కోట్ల మంది ఢిల్లీ ఎన్నికల్లో ఓటేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధించింది. అనంతరం ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందో ఎగ్జిట్ పోల్స్ తేల్చనున్నాయి.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: కుంభమేళాకి భూటాన్ రాజు… సంగమంలో పుణ్యస్నానం..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా… ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు.
ఇది కూడా చదవండి: Legislative Council : కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తిన వాసులు ఎవరికీ అధికారం కట్టబెడతారో చూడాలి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాలు
న్యూఢిల్లీ నియోజకవర్గం
ఆప్ – అరవింద్ కేజ్రీవాల్
బీజేపీ – పర్వేష్ వర్మ
కాంగ్రెస్ – సందీప్ దీక్షిత్
కల్కాజీ నియోజకవర్గం
ఆప్ – అతిషీ
బీజేపీ – రమేష్ బిధూరీ
కాంగ్రెస్ – అల్కా లంబా
జంగ్పురా నియోజకవర్గం
ఆప్ – మనీష్ సిసోడియా
బీజేపీ – సర్దార్ తర్వీందర్ సింగ్ మార్వా
కాంగ్రెస్ – ఫర్హాద్ సురి
ప్రతాప్గంజ్ నియోజకవర్గం
ఆప్ – అవధ్ ఓజా
బీజేపీ – రవిందర్ సింగ్ నేగి
కాంగ్రెస్ – అనిల్ చౌదరీ