Legislative Council : కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది
- ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ
- కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది
- తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలి: మధుసూదనాచారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Legislative Council : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడారు.
మధుసూదనాచారి మాట్లాడుతూ, కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ డేటా వివరాలు ఇప్పటివరకు అందరికీ అందుబాటులో లేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రభుత్వం కొంత కాలయాపన చేశిందని విమర్శించారు. అటు, కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కులగణన జరగిందని ఆయన వెల్లడించారు.
Also Read
- US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
- ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- Rohit Sharma: "రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?".. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
కులగణనపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, కానీ ప్రస్తుతం జరుగుతున్న సర్వేను కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు, దానికి విదేశాల్లోని తెలంగాణవారు కూడా పాల్గొన్నారని కవిత గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు చేసిన సర్వేలో బీసీ జనాభా 20 లక్షల మేర తగ్గినట్లు ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ డేటాను బయట పెట్టే అంశాన్ని ఆశించామని, కానీ అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ, ఈ డేటాతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఉద్దేశించింది అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమీ ప్రకటించలేదని ఆమె వ్యాఖ్యానించారు.
కవిత, బీసీలకు హామీలను పటిష్టంగా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం చెప్పినట్లు కులగణనలో ఓసీల జనాభా పెరిగిందని, మిగతా కులాల జనాభా ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా, కులగణనపై కొనసాగుతున్న చర్చలు, ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇంకా స్పష్టతకు రాలేదు. అయితే.. ఈ క్రమంలోనే తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా వేశారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
Car Fireaccident : అన్నోజిగూడ ఫ్లైఓవర్పై కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
-
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
-
Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
-
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?