Legislative Council : కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది
- ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ
- కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది
- తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలి: మధుసూదనాచారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Legislative Council : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడారు.
మధుసూదనాచారి మాట్లాడుతూ, కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ డేటా వివరాలు ఇప్పటివరకు అందరికీ అందుబాటులో లేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రభుత్వం కొంత కాలయాపన చేశిందని విమర్శించారు. అటు, కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కులగణన జరగిందని ఆయన వెల్లడించారు.
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
కులగణనపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, కానీ ప్రస్తుతం జరుగుతున్న సర్వేను కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు, దానికి విదేశాల్లోని తెలంగాణవారు కూడా పాల్గొన్నారని కవిత గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు చేసిన సర్వేలో బీసీ జనాభా 20 లక్షల మేర తగ్గినట్లు ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ డేటాను బయట పెట్టే అంశాన్ని ఆశించామని, కానీ అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ, ఈ డేటాతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఉద్దేశించింది అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమీ ప్రకటించలేదని ఆమె వ్యాఖ్యానించారు.
కవిత, బీసీలకు హామీలను పటిష్టంగా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం చెప్పినట్లు కులగణనలో ఓసీల జనాభా పెరిగిందని, మిగతా కులాల జనాభా ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా, కులగణనపై కొనసాగుతున్న చర్చలు, ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇంకా స్పష్టతకు రాలేదు. అయితే.. ఈ క్రమంలోనే తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా వేశారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
Car Fireaccident : అన్నోజిగూడ ఫ్లైఓవర్పై కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!