India – Pakistan War: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాధారణ కార్యకలాపాలు.. ప్రయాణికులకు కీలక సూచనలు..
- ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ కార్యకలాపాలు..
- ఈ రోజు తెల్లవారుజామున తిరిగి ప్రారంభం..
- ప్రయాణికులకు కీలక సూచనలు జారీ..
India – Pakistan War: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభం అయ్యాయి.. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతా సంసిద్ధత పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఒక సలహా జారీ చేశారు.. ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయి. అయితే, మారుతున్న వైమానిక పరిస్థితులు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల ప్రకారం పెరిగిన భద్రతా చర్యల కారణంగా, కొన్ని విమానాల షెడ్యూళ్ల ప్రభావం ఉండొచ్చు.. భద్రతా తనిఖీ ప్రాసెసింగ్ సమయాలు ఎక్కువ సమయం ఉండవచ్చు అని పేర్కొంది..
Read Also: India Pak War : భారత్లో 32 విమానాశ్రయాలు మూసివేత..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
విమానాశ్రయ ఆపరేటర్.. ప్రయాణికులకు ఈ కీలక సూచనలు చేశారు.. మీరు ప్రయాణించే విమానయాన సంస్థల నుండి తాజా సమాచారం పొందండి. హ్యాండ్ బ్యాగేజ్ మరియు చెక్-ఇన్ లగేజ్ నియమాలను అనుసరించండి. భద్రతా తనిఖీల వద్ద సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉన్నందున.. ఆ జాప్యాన్ని అధిగమించడానికి ముందుగానే ఎయిర్పోర్ట్కు చేరుకోండి. భద్రతా తనిఖీలు, ప్రయాణం సజావుగా సాగేందుకు ఎయిర్లైల్స్ సిబ్బంది, భద్రతా సిబ్బందికి సహకరించండి. ఎయిర్లైన్ లేదా.. ఢిల్లీ విమానాశ్రయ అధికారిక వెబ్సైట్ ద్వారా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించింది..
Read Also: Operation Sindoor: పాక్ వ్యాప్తంగా భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత..
ఇక, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), సంబంధిత విమానయాన అధికారులు ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం విదితమే.. ఎయిర్మెన్ (NOTAMs)కి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరిస్థితులను బట్టి ఇది అమల్లో ఉండనుంది.. 32 విమానాశ్రయాల జాబితాలో అధంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపూర్, బతిండా, భుజ్, బికనీర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్నగర్, జోధ్పూర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోడ్, కిషన్గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్కోట్, పాటియాలా, పోర్బందర్, రాజ్కోట్ (హిరాసర్), సర్సావా, సిమ్లా, శ్రీనగర్, థోయిస్ మరియు ఉత్తర్లై ఉన్నాయి. పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ఉత్తరాన బారాముల్లా నుండి దక్షిణాన భుజ్ వరకు, అంతర్జాతీయ సరిహద్దు.. నియంత్రణ రేఖ (LOC) రెండింటిలోనూ 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి.. ఈ డ్రోన్లు ఆయుధాలు కలిగి ఉన్నాయని.. ప్రజలను, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!