Farming: సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు.. ఆదర్శంగా నిలుస్తున్న రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming: మనం తినే ఆహార పదార్థాలలో కూరగాయలు కూడా ఒక భాగం. రోజు మనం తినే ఆహారంలోకి ఏదొక కూరను వండుకొని తినక తప్పదు. అందుకోసం మనం కూరగాయల్లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలనే ఇష్టపడతాం. మార్కెట్లో కూరగాయలు తాజాగా ఉన్నాయంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువైన పెట్టి కొంటాం. అయితే ఇప్పుడున్న కాలంలో కూరగాయలపై రసాయనిక ఎరువులు వాడటం వల్ల.. మనుషులు రోగాలకు గురవుతున్నారు. దీంతో తాజా కూరగాయలు పొందాలంటే కష్టతరంగా మారింది. మరోవైపు చాలామంది రైతులు త్వరగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు వాడుతున్నారు. పొలంలో ఆవు పేడకు బదులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఇది మనం తినే కూరగాయలపై తాజాదనం, రుచిని ప్రభావితం చేస్తుంది.
Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
మన దేశంలో సేంద్రీయ పద్ధతిలో పండించే రైతులు కొందరు ఉన్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. వారు పండించిన కూరగాయలు మార్కెట్లో వెంటనే అమ్ముడుపోతాయి. అలా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బీహార్లోని దర్భంగా జిల్లాలో నివసిస్తున్న రైతు మహ్మద్ వాసిం.. తన పొలంలో పచ్చని కూరగాయలు పండిస్తున్నాడు. తన పొలంలో పండించిన కూరగాయలను సమీపంలోని మార్కెట్లో విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. కానీ విపరీతమైన వేడితో పంటల పండక.. దిగుబడిపై ప్రభావం చూపుతోందని తెలుపుతున్నాడు.
Read Also: Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?
పంటలు పండించడానికి ముఖ్యంగా నీరు కావాలి. అయితే విపరీతమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు బాగా పడిపోయాయని మహ్మద్ వాసీం చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, కూరగాయలకు నీరు పెట్టేందుకు కష్టమవుతుందని ఆ రైతు అంటున్నాడు. ఉష్ణోగ్రత తీవ్రత కారణంగా కూరగాయల తీగలు ఎండిపోతున్నాయని.. దూరప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చి కూరగాయలకు నీరందిస్తున్నట్లు చెపుతున్నాడు. ప్రస్తుతం, మహ్మద్ వసీం కూరగాయల సాగు పెంపకంలో కాకరకాయ, బీరకాయలతో పాటు అనేక రకాల ఆకుకూరలు పండిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇంతకు ముందు కూరగాయల దిగుబడి బాగా ఉండేదని.., ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా దిగుబడి తగ్గిందని అంటున్నాడు. అయితే ఇంత జరిగినా అక్కడ మాత్రం కూరగాయలను తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!