Farming: సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు.. ఆదర్శంగా నిలుస్తున్న రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming: మనం తినే ఆహార పదార్థాలలో కూరగాయలు కూడా ఒక భాగం. రోజు మనం తినే ఆహారంలోకి ఏదొక కూరను వండుకొని తినక తప్పదు. అందుకోసం మనం కూరగాయల్లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలనే ఇష్టపడతాం. మార్కెట్లో కూరగాయలు తాజాగా ఉన్నాయంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువైన పెట్టి కొంటాం. అయితే ఇప్పుడున్న కాలంలో కూరగాయలపై రసాయనిక ఎరువులు వాడటం వల్ల.. మనుషులు రోగాలకు గురవుతున్నారు. దీంతో తాజా కూరగాయలు పొందాలంటే కష్టతరంగా మారింది. మరోవైపు చాలామంది రైతులు త్వరగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు వాడుతున్నారు. పొలంలో ఆవు పేడకు బదులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఇది మనం తినే కూరగాయలపై తాజాదనం, రుచిని ప్రభావితం చేస్తుంది.
Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
మన దేశంలో సేంద్రీయ పద్ధతిలో పండించే రైతులు కొందరు ఉన్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. వారు పండించిన కూరగాయలు మార్కెట్లో వెంటనే అమ్ముడుపోతాయి. అలా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బీహార్లోని దర్భంగా జిల్లాలో నివసిస్తున్న రైతు మహ్మద్ వాసిం.. తన పొలంలో పచ్చని కూరగాయలు పండిస్తున్నాడు. తన పొలంలో పండించిన కూరగాయలను సమీపంలోని మార్కెట్లో విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. కానీ విపరీతమైన వేడితో పంటల పండక.. దిగుబడిపై ప్రభావం చూపుతోందని తెలుపుతున్నాడు.
Read Also: Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?
పంటలు పండించడానికి ముఖ్యంగా నీరు కావాలి. అయితే విపరీతమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు బాగా పడిపోయాయని మహ్మద్ వాసీం చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, కూరగాయలకు నీరు పెట్టేందుకు కష్టమవుతుందని ఆ రైతు అంటున్నాడు. ఉష్ణోగ్రత తీవ్రత కారణంగా కూరగాయల తీగలు ఎండిపోతున్నాయని.. దూరప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చి కూరగాయలకు నీరందిస్తున్నట్లు చెపుతున్నాడు. ప్రస్తుతం, మహ్మద్ వసీం కూరగాయల సాగు పెంపకంలో కాకరకాయ, బీరకాయలతో పాటు అనేక రకాల ఆకుకూరలు పండిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇంతకు ముందు కూరగాయల దిగుబడి బాగా ఉండేదని.., ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా దిగుబడి తగ్గిందని అంటున్నాడు. అయితే ఇంత జరిగినా అక్కడ మాత్రం కూరగాయలను తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు.
తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?