Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- చమోలీ సొరంగం ప్రమాదం
- 7 మంది కార్మికులు మృతి
- పరిస్థితిని సమీక్షించిన సీఎం ధామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chamoli Tunnel Accident: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో విష్ణుగడ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా సొరంగంలోకి భారీగా బురద, నీరు చేరడంతో సుమారు 22 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యల్లో ఇప్పటివరకు పలువురిని బయటకు తీసుకురాగా, ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 14 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక కార్మికుడు గల్లంతైనట్లు సమాచారం. సాయంత్రం 6:30 నుంచి 6:45 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చమోలీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుర్జీత్ సింగ్ పవార్ తెలిపారు.
సొరంగం ప్రవేశద్వారం నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో పెద్ద మొత్తంలో బురద, నీరు ఒక్కసారిగా ప్రవహించడంతో కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం లోపల సుమారు 1.8 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఒక గుహ నుంచి నీరు, శిథిలాలు ఉధృతంగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
ఏడుగురు మృతి.. 14 మందికి గాయాలు
ప్రమాదం జరిగిన సమయంలో సొరంగంలో మొత్తం 22 మంది కార్మికులు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో పలువురిని బయటకు తీసుకురాగా, ఏడుగురు మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతుల్లో ఉత్తరాఖండ్లోని తెహ్రీ, చమోలీ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. గాయపడిన కార్మికుల్లో ఎక్కువ మంది జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినవారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన కార్మికులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సహాయక చర్యలకు ఆటంకం
సొరంగంలో నీరు, బురద మరింత పెరగడంతో కొంతసేపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలను రంగంలోకి దించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపేందుకు మూడు భారీ పంపులను కూడా ఏర్పాటు చేశారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స
రక్షించిన కార్మికుల్లో ముగ్గురు నుంచి నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం వారిని ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.
పరిస్థితిని సమీక్షించిన సీఎం ధామి
ప్రమాదం తీవ్రతపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. సొరంగంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
చమోలిలో భారీ వర్షాలు.. వంతెన కొట్టుకుపోయింది
ఇదిలా ఉండగా, చమోలీ జిల్లాలో భారీ వర్షాలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. సోమవారం మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షాల కారణంగా తమక్ నాలా ఉధృతంగా ప్రవహించింది. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల నిర్మించిన ఇనుప వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనతో స్థానికంగా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ప్రాంతంలోని రైతుల ఆపిల్ పంటలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం.
అప్రమత్తమైన అధికారులు
చమోలీలో గత కొన్ని రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో చిన్న నదులు, వాగులు పొంగిపొర్లాయి. తమక్ నాలాలోనూ నీటి ప్రవాహం భారీగా పెరిగింది. సొరంగ ప్రమాదం, భారీ వర్షాలు, వంతెన కొట్టుకుపోవడం వంటి వరుస ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సొరంగంలో ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయాన్ని నిర్ధారించేందుకు రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Astrology: ఆగస్టు 14 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు వారు కాస్త జాగ్రత్త..!
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!