Covid cases: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం, దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన పెంచుతోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఇటీవల భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఏప్రిల్లో తమిళనాడులో NB.1.8.1 కేసు ఒకటి నమోదైంది, మేలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు.
Read Also: Honeytrap: వృద్ధుడితో 28 ఏళ్ల యువతి అసభ్యకర చేష్టలు.. వీడియోలు తీసి రూ.50 లక్షలు డిమాండ్..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రెండు సబ్ వేరియంట్లను, వేరియంట్స్ అండర్ మానిటరింగ్ (VUMలు)గా వర్గీకరించింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్లు కారణం. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ ఇన్ఫెక్షన్లు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూర్లో కొవిడ్ సంబంధిత మరణం నమోదైంది. కోవిడ్ సహా ఇతర అనారోగ్యాలతో 84 ఏళ్ల రోగి మరణించాడు. బెంగళూర్లో 9 నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుత శిశువుకు చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుంది. రాష్ట్రం తన నాల్గవ కోవిడ్-19 మరణం నమోదైంది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్తో 21 ఏళ్ల వ్యక్తి థానేలో మరణించారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం కోవిడ్-19 పరిస్థితిని ఆరోగ్య పరిశోధన విభాగం (డిహెచ్ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) మరియు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) అధికారులతో సమీక్షించారు.