Supreme Court: కోర్టులు నైతికత, నీతిని బోధించే స్థలం కాదు.. మహిళ అక్రమసంబంధం కేసులో కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోర్టులు నైతికత గురించి బోధించే ప్రత్యేక స్థలం కానద వ్యాఖ్యానించింది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చట్టానికి కట్టబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళ అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు పిల్లల్ని చంపేయడంతో పాటు తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందనే కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న మహిళను, ఆ సంబంధాన్ని అడ్డు పెట్టుకుని అతను బెదిరించడం వల్ల తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించగా.. మహిళ ప్రాణాలతో బయటపడింది.
Read Also: Asia Cup 2023: పాకిస్తాన్కు షాక్.. అలాంటి ప్రతిపాదన ఏం లేదన్న బీసీసీఐ..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఈ కేసులో మహిళపై ఐపీసీ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ట్రయిల్ కోర్టులు ఐపీసీ సెక్షన్లు 302(హత్య), 309(ఆత్మహత్య) కింద సదురు మహిళను దోషిగా నిర్థారించింది. తాను 20 ఏళ్లుగా జైలులో ఉన్నానని, తనను ముందస్తుగా విడుదల చేయాలని మహిళ వేడుకుంది. అయితే ఆమె చేసిన నేరం యొక్క క్రూరత్వాన్ని, క్రూరమైన స్వభావాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసును తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది.
తన అక్రమ సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో మహిళ తన కుమారులను హత్య చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీనికి విరుద్ధంగా పిల్లలతో కలిసి తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ కేసులో అక్రమ సంబంధం ముఖ్యం కాదని, గొడవలు, నిరాశతోనే ఆమె ఇలా చేసిందని బెంజ్ పేర్కొంది. ఈ కోర్టు నైతికత, నీతిని బోధించే సంస్థ కాదని, చట్టబద్ద పాలనకు కట్టుబడి ఉన్నామని బెంచ్ వ్యాఖ్యానించింది. దీన్ని క్రూరమైన నేరంగా పరిగణించలేమని, సకాలంలో ఆమె మేన కోడలు గుర్తించడంతో ప్రాణాలతో బయపడిందని, అంతేకాకుండా 20 ఏళ్లు జైలులో ఉందని కోర్టు పేర్కొంది. మహిళను ముందస్తుగా విడుదల చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ చేసిన సిఫార్సును అంగీకరించకపోవడానికి సరైన కారణం లేదా సమర్థనీయమైన కారణం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!