Delhi Riots Case: ఢిల్లీ అల్లర్లలో ఆప్ కీలక నేతపై మర్డర్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Riots Case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ సమయంలో ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. చాంద్ బాగ్ పులియా సమీపంలోని ఖజూరి ఖాస్ డ్రెయినేజ్ కాలువ నుంచి అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ హత్య సంచలనంగా మారింది. అంకిత్ శర్మ హత్యకు సంబంధించి ఆమ్ ఆద్మీ నేత తాహిర్ హుస్సెన్, మరో 10 మందిపై ఢిల్లీ కోర్టు గురువారం కిడ్నాప్, మర్డర్ అభియోగాలను మోపింది. అధికారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుస్సేన్ తోపాటు 11 మంది నిందితులపై దయాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను అదనపు సెషన్స్ జడ్డి పులస్త్య ప్రమాచల విచారించారు.
Read Also: NTR 30: ఎన్టీఆర్ సినిమాకి జక్కన వారసుడు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు…
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
నిందితులు మహ్మద్ తాహిర్ హుస్సేన్, హసీన్, నజీమ్, కాసిం, సమీర్ ఖాన్, అనాస్, ఫిరోజ్, జావేద్, గుల్ఫామ్, షోయిబ్ ఆలం, ముంతాజిమ్ లపై సెక్షన్ 120 బి(నేరపూరిత కుట్ర), 302 (హత్య), 147 ( అల్లర్లు), 148 ( మారణాయుధాలతో అల్లర్లు పాల్పడటం), 153ఏ( మత కలహాలను రెచ్చగొట్టడం) వంటి అభియోగాలను మోపింది కోర్టు. అంకిత్ శర్మ మృతదేహాన్ని కాలువలో పారేస్తున్న సమయంలో ప్రత్యక్ష సాక్షి తీసిన వీడియోలో అనాస్, నజీమ్, కాసిమ్ మినహా మిగతా నిందితుల కాల్ వివరాలు బట్టి చూస్తే నిందితులంతా అక్కడే ఉన్నట్లు రుజువవుతోందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుకర్ పాండే అన్నారు.
నిందితులంగా హిందువులను, వారి ఆస్తులను లక్ష్యగా చేసుకుని రెండు వర్గాల మద్య సామరస్యానికి విఘాతం కలిగించారని న్యాయమూర్తి అన్నారు. తాహిర్ హుస్సేన్ కూడా హిందువులను చంపేందుకు ప్రేరేపించారని న్యాయమూర్తి చెప్పారు. హిందువులపై దాడి చేసి చంపడం, వారి ఆస్తులపైకి పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడులు చేయడమే వారి లక్ష్యం అని స్పష్టంగా తెలియజేస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!