కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్కు చిక్కులు తప్పడం లేదు. వివిధ సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలతో దేశంఅంతటా వ్యతిరేకత పెరిగి పోతుంది. ఆమె బీజేపీ ఏజెంటని కొందరూ మండిపడుతున్నారు. ఇలాంటి వారికి అసలు పద్మశ్రీ ఇవ్వడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఇదిలా ఉంటే కంగనా గతంలో స్వాతంత్ర్యం 1947 లో రాలేదని అది కేవలం భిక్ష అని నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని పేర్కొన్నారు. దీంతో స్వాంత్రంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది త్యాగాలను ఆమె అవమానించిందని దేశంలో పలు చోట్ల నిసరనప్రదర్శనలు చేశారు. అప్పటి నుంచే ఆమె పద్మశ్రీ పురస్కా రాన్ని సైతం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది.
తాజాగా ఢీల్లీ సిక్కు గురద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) ఈ అంశం పై రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ముఖ్యంగా సిక్కులను లక్ష్యంగా చేసుకుని కంగనా రనౌత్ వివాదాలు సృష్టిస్తు న్నారని పేర్కొంది. అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతల ను అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదు చేసింది. వెంటనే ప్రభు త్వం ఆమెకు ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. విద్వేషపూరితమైన మాటలతో దేశ ప్రజలను రెచ్చగొట్టేలా కంగన రనౌత్ వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.