Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..
- డబ్బు, ఉచిత వైద్యం అందిస్తామని హిందువులను క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నం..
- నిందితులపై చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
- బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పిన అలహాబాద్ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forced Conversion: బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనింది. భారతదేశంలో నివాసం ఉంటున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది. అయితే, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడం, వ్యాప్తి చేసే హక్కును ఇచ్చినప్పటికీ, బలవంతపు మత మార్పిడులకు మాత్రం మద్దతు ఇవ్వదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం, 2021 కింద నిందితులుగా ఉన్న నలుగురిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న పిటిషన్ను తిరస్కరిస్తూ జస్టిస్ వినోద్ దివాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
అయితే, డబ్బు, ఉచిత వైద్యం అందిస్తామని మోసపూరిత హామీలతో ప్రజలను హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మార్చడానికి కొందరు నిందితులు ప్రయత్నించారు. దీంతో వారిపై యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేద చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వినోద్ దివాకర్ మాట్లాడుతూ.. భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నారు.. కానీ, మత ప్రచారం ముసుగులో బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు.
Read Also: Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్.. 200 బిలియన్ డాలర్ల సాయం..!
ఇక, మత స్వేచ్ఛను వినియోగించుకోవడం వల్ల సామాజిక నిర్మాణం దెబ్బతినకుండా చూడాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొనింది. ఒక మతం మరొక మతం కంటే స్వతహాగా ఉన్నతమైనదనే భావన, ఆ మతంలోని నైతిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తుంది అన్నారు. ఇటువంటి భావన రాజ్యాంగంలోని లౌకికవాద ఆలోచనకు విరుద్ధం అని తెలిపారు. భారత్ లౌకికవాదం దేశం అన్ని మతాలకు సమాన గౌరవం అనే సూత్రంలో నడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు.. అన్ని మతాలు సమాన దూరాన్ని కొనసాగించాలని జస్టిస్ వినోద్ దివాకర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!