Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyan Banerjee: కాంగ్రెస్ (TMC) ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పార్టీకి గుడ్బై చెబుతున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఢిల్లీ వేదికగా లోక్సభ సభ్యులు సైతం తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ తరుణంలో మమతా బెనర్జీకి కోలుకోలేని విధంగా అత్యంత బలమైన షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మమతకు అత్యంత నమ్మకస్తుడైన కల్యాణ్ బెనర్జీ సైతం ఇప్పుడు తిరుగుబాటు బాట పట్టారు. తన 40 ఏళ్ల నాటి రాజకీయ సహచరురాలు కాకోలి ఘోష్ను సైతం పక్కన పెట్టి, మమతా బెనర్జీ ఏ కల్యాణ్ బెనర్జీని అయితే చీఫ్ విప్గా నియమించారో.. ఇప్పుడు అదే కల్యాణ్ బెనర్జీ పార్టీ అధినేత్రికి గట్టి అల్టిమేటం జారీ చేశారు. “మీకు మీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలా? లేక నాలాంటి నమ్మకమైన నాయకులు కావాలా? తేల్చుకోండి” అంటూ మమతకు స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి తొలగించకపోతే తాము పార్టీలో కొనసాగలేమని తేల్చి చెప్పారు.
అంతేకాకుండా, అభిషేక్ బెనర్జీపై ఉన్న ఫోర్జరీ సంతకాల కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు కల్యాణ్ బెనర్జీ ప్రకటించారు. ఈ సందర్భంగా అభిషేక్పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “అభిషేక్ బెనర్జీకి నాపై ఎప్పుడూ నమ్మకం లేదు, ఇకముందు కూడా ఉండదు. రేపు కోర్టులో జరగబోయే విచారణ కోసం నేను అర్ధరాత్రి వరకు ప్రిపేర్ అవుతుంటే, హఠాత్తుగా లాయర్ను మార్చేశామని నాకు సమాచారం ఇచ్చారు. ఇది నన్ను తీవ్రంగా అవమానించడమే. అభిషేక్కు పెద్దలను గౌరవించడం అస్సలు తెలియదు, అతను ఒక అహంకారి. అసలు పార్టీలో అతని స్థానం ఏంటి? అతని వల్లే పార్టీకి ఇంత పెద్ద నష్టం వాటిల్లింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎల్లప్పుడూ మమతా బెనర్జీ వైపే ఉంటానని చెబుతూనే.. “దీదీ ఇప్పుడు నిర్ణయించుకోవాలి.. ఆమెకు పార్టీ, నమ్మకమైన నాయకులు కావాలా? లేక ఒక చిన్నపిల్లాడు, కుటుంబం కావాలా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
మరోవైపు.. తృణమూల్ కాంగ్రెస్ పతనానికి కల్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ‘చివరి మేకు’ లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, కోర్టుల్లో పార్టీకి సంబంధించిన ఎన్నో కీలక కేసులను కల్యాణ్ బెనర్జీయే స్వయంగా వాదించారు. అభిషేక్ బెనర్జీ నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసులోనూ ఆయనే లాయర్గా ఉన్నారు. అలాంటి కీలక నేత తిరుగుబాటు చేయడానికి కొన్ని గంటల ముందే మమతకు మరో రెండు పెద్ద షాక్లు తగిలాయి. మొదట రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరాయిక్ తన పదవికి రాజీనామా చేయగా, నిన్నటివరకు మమతకు మద్దతుగా నిలిచిన ప్రసూన్ బెనర్జీ లోక్సభలో తిరుగుబాటు చేసిన కాకోలి గ్రూప్తో చేతులు కలిపారు. లోక్సభలో తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని కోరుతూ కాకోలి వర్గం స్పీకర్కు ఇచ్చిన లేఖపై ప్రసూన్ బెనర్జీ కూడా సంతకం చేయడం టీఎంసీలో కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!