Congress: సంజయ్ నిరుపమ్ని బహిష్కరించనున్న కాంగ్రెస్.. ఠాక్రేపై వ్యాఖ్యలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ని బహిష్కరించేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇండియా కూటమిపై సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపాదనల్ని హైకమాండ్కి పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ల లిస్టు నుంచి ఇప్పటికే నిరుపమ్ని తొలగించింది. అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఇటీవల మహా కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. మాజీ ఎంపీ అయిన నిరుపమ్, ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..
Also Read
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
వివాదం ఏమిటి.?
ముంబాయ్ నార్త్-వెస్ట్ సీటు నుంచి నిరుపమ్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అమోల్ కీర్తికర్ని ఆ స్థానంలో నిలబెట్టారు. 2019లో శివసేన నేత గజానన్ కీర్తీకర్ చేతిలో నిరుపమ్ ఓడిపోయారు. ప్రస్తుతం గజానన్ ఏక్ నాథ్ షిండే పక్షాన ఉన్నారు. మరోవైపు పొత్తులో భాగంగా ఏక్నాథ్ షిండే ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని భావిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి నిరుపమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతు లేకుండా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏ సీటును గెలుచుకోలేదని అన్నారు. కోవిడ్ సమయంలో ఖిడ్డీ స్కామ్లో వలస కార్మికులకు ఉచిత ఆహారం అందిచే కార్యక్రమంలో అమోల్ కీర్తికర్ లంచాలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే నిరుపమ్ పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే నిరుపమ్ మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే అన్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా నిరుపమ్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
-
Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్తో వస్తున్న SUV
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!