Congress: సంజయ్ నిరుపమ్ని బహిష్కరించనున్న కాంగ్రెస్.. ఠాక్రేపై వ్యాఖ్యలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ని బహిష్కరించేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇండియా కూటమిపై సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపాదనల్ని హైకమాండ్కి పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ల లిస్టు నుంచి ఇప్పటికే నిరుపమ్ని తొలగించింది. అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఇటీవల మహా కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. మాజీ ఎంపీ అయిన నిరుపమ్, ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
వివాదం ఏమిటి.?
ముంబాయ్ నార్త్-వెస్ట్ సీటు నుంచి నిరుపమ్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అమోల్ కీర్తికర్ని ఆ స్థానంలో నిలబెట్టారు. 2019లో శివసేన నేత గజానన్ కీర్తీకర్ చేతిలో నిరుపమ్ ఓడిపోయారు. ప్రస్తుతం గజానన్ ఏక్ నాథ్ షిండే పక్షాన ఉన్నారు. మరోవైపు పొత్తులో భాగంగా ఏక్నాథ్ షిండే ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని భావిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి నిరుపమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతు లేకుండా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏ సీటును గెలుచుకోలేదని అన్నారు. కోవిడ్ సమయంలో ఖిడ్డీ స్కామ్లో వలస కార్మికులకు ఉచిత ఆహారం అందిచే కార్యక్రమంలో అమోల్ కీర్తికర్ లంచాలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే నిరుపమ్ పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే నిరుపమ్ మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే అన్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా నిరుపమ్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!