JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి ‘వంశపారంపర్య పార్టీల’ కూటమిగా అభివర్ణించారు. ఈ కూటమిలోని సగం మంది నాయకులు జైల్లో ఉంటే, మరో సగం మంది బెయిల్పై ఉన్నారని అన్నారు. ఈ రోజు రాజస్థాన్ ఝాలావర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అలయన్స్ అనేది అవినీతి రక్షణ కూటమి అని అన్నారు. ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అన్ని చోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ బెయిల్పై వచ్చారా..? లేదా..?, సోనియాగాంధీ, చిదంబర్, సంజయ్ సింగ్ బెయిల్పై బయట ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారా..? లేదా..?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇండియా కూటమిలో సగం నేతలు జైలులో ఉంటే, సగం మంది బెయిల్పై బయట ఉన్నారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
Read Also: Summer Heatwave: ఈ వేసవి చాలా హాట్ గురూ.. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు..
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని నడ్డా ప్రశంసించారు. ఈ రోజు దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉందని చెప్పారు. మోడీ నాయకత్వంలో గ్రామాల పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. 2014లో మోడీ ప్రధాని అయ్యే సమయానికి 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని చెప్పారు. 3.5 లక్షల గ్రామాలకు రోడ్లతో అనుసంధానించామని అన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, ఫలితంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది అందులోంచి బయటపడ్డారని చెప్పారు. పేదలు, రిక్షా పుల్లర్లు, టీ విక్రేతలు, బస్సు డ్రైవర్లు మరియు క్లీనర్లతో సహా 55 కోట్ల మంది జనాభాలో 40 శాతం మందికి తీవ్రమైన అనారోగ్యాల కోసం ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించామని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!