Nirmala Sitharaman: ప్రజ్వల్ రేవణ్ణపై సాక్ష్యాలు ఉన్నా ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రజ్వల్తో పాటు అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై మహిళ లైంగిక వేధింపులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పాటు హసన్ జిల్లాలో ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఏడాది కాలంగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వొక్కలిగి ఓట్లు కోల్పోతామనే భయంతోనే కాంగ్రెస్ ఈ పనిచేసిందని అన్నారు. అందుకనే కర్ణాటకలో తొలిదశ ఎంపీ స్థానాలకు ఓటింగ్ అయిపోయేంత వరకు మౌనంగా ఉందని ఆమె అన్నారు.
Read Also: Terrorists Attack: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి..
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
మహిళకు వ్యతిరేకంగా జరిగే విషయాలను సహించబోమని కేంద్ర హోం మంత్రి స్పష్టంగా తెలియజేశారని, జేడీయూతో పొత్తు ఉన్నప్పటికీ ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీనిపై దర్యాప్తు జరగాలని మేము స్పష్టం చేశామని ఆమె పూణేలో విలేకరులు సమావేశంలో అన్నారు. రేవణ్ణ చర్యలకు సంబంధించిన ఆధారాలు ఉన్న పెన్డ్రైవ్ని ఓ డ్రైవర్ కాంగ్రెస్కి, కర్ణాటక హోంమంత్రికి అందించినట్లు సమాచారం ఉందని, కానీ వారు ఈ సాక్ష్యాలను సుమారు ఏడాది పాటు నొక్కిపెట్టారని, జేడీఎస్ మాతో పొత్తులో ఉన్నందున మమ్మల్ని టార్గెట్ చేశారని అన్నారు. పెన్డ్రైవ్లో ఏముందో రాష్ట్రమంత్రులకు తెలుసు కానీ మహిళల భద్రతే తమ ప్రాధాన్యత అని భావించడం లేదని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
వొక్కలిగ వర్గం ఓట్లు పోతాయాని తొలి దశ పోలింగ్ వరకు మౌనంగా ఉండీ, ఇప్పుడు పెద్ద సమస్యగా మార్చి కాంగ్రెస్ తన కపటత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించింది. ఏడాది పాటు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాల నుంచి ప్రజ్వల్ రేవణ్ణను రప్పించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రధానికి లేఖ రాసిందని, కర్ణాటక ప్రభుత్వం కోరుకున్న అన్ని చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేసినట్లు ఆమె చెప్పారు. బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి 400 సీట్లు గెలుచుకుంటుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!