Delhi Assembly Election: రూ.25 లక్షల ఆరోగ్య భద్రత స్కీమ్ ప్రకటించిన కాంగ్రెస్
- రూ.25 లక్షల ఆరోగ్య భద్రత స్కీమ్ ప్రకటించిన కాంగ్రెస్
- ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అశోక్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా ‘‘జీవన్ రక్షా యోజన’’ కింద రూ. 25 లక్షల ఆరోగ్య భద్రత పథకాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాజా పథకం ఢిల్లీ ప్రజలకు గేమ్ ఛేంజర్ లాంటిదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: OG Movie : పవన్ కోసం దిగొచ్చిన శింబు.. ఈ సాంగ్ వేరే లెవల్
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
కొత్త పథకం ప్రకటన అనంతరం అశోక్ గెహ్లా్ట్ మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు మారిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రచారం బాగా చేస్తోందని.. ఈసారి ఫలితాలు భిన్నంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ గవర్నర్మెంట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రజలకు రూ.25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. రాజస్థాన్లో ఈ పథకం చాలా విజయవంతమైందని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే చేస్తామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకమైతే పరిమితులు కలిగి ఉందని.. ఈ పథకానికి మాత్రం పరిమితులు లేవన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.2,500 ‘‘ప్యారీ దీదీ యోజన’’ అమలు చేస్తామని ప్రకటించారు. కర్ణాటకలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahindra XEV 9E, BE 6: మహీంద్రా XEV 9E, BE 6 టాప్ వేరియంట్స్ ధరలు, బుకింగ్ షెడ్యూల్ రిలీజ్..
ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తలపడుతున్నాయి. ఇప్పటికే ఆప్ అభ్యర్థులను వెల్లడించింది. బీజేపీ తొలి జాబితాలో 29 మంది అభ్యర్థులను వెల్లడించగా.. కాంగ్రెస్ కొంత మంది పేర్లును ప్రకటించింది. ఇక ఆప్కు సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలిపింది. ఇక బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు మాయావతి తెలిపింది.
ఇది కూడా చదవండి: Ras Kik Coco : రిలయన్స్ ” కిక్” ఇచ్చే కూల్ డ్రింక్.. టాటాకు పోటీగా..!
తాజావార్తలు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!