Delhi Assembly Election: రూ.25 లక్షల ఆరోగ్య భద్రత స్కీమ్ ప్రకటించిన కాంగ్రెస్
- రూ.25 లక్షల ఆరోగ్య భద్రత స్కీమ్ ప్రకటించిన కాంగ్రెస్
- ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అశోక్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా ‘‘జీవన్ రక్షా యోజన’’ కింద రూ. 25 లక్షల ఆరోగ్య భద్రత పథకాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాజా పథకం ఢిల్లీ ప్రజలకు గేమ్ ఛేంజర్ లాంటిదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: OG Movie : పవన్ కోసం దిగొచ్చిన శింబు.. ఈ సాంగ్ వేరే లెవల్
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
కొత్త పథకం ప్రకటన అనంతరం అశోక్ గెహ్లా్ట్ మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు మారిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రచారం బాగా చేస్తోందని.. ఈసారి ఫలితాలు భిన్నంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ గవర్నర్మెంట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రజలకు రూ.25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. రాజస్థాన్లో ఈ పథకం చాలా విజయవంతమైందని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే చేస్తామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకమైతే పరిమితులు కలిగి ఉందని.. ఈ పథకానికి మాత్రం పరిమితులు లేవన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.2,500 ‘‘ప్యారీ దీదీ యోజన’’ అమలు చేస్తామని ప్రకటించారు. కర్ణాటకలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahindra XEV 9E, BE 6: మహీంద్రా XEV 9E, BE 6 టాప్ వేరియంట్స్ ధరలు, బుకింగ్ షెడ్యూల్ రిలీజ్..
ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తలపడుతున్నాయి. ఇప్పటికే ఆప్ అభ్యర్థులను వెల్లడించింది. బీజేపీ తొలి జాబితాలో 29 మంది అభ్యర్థులను వెల్లడించగా.. కాంగ్రెస్ కొంత మంది పేర్లును ప్రకటించింది. ఇక ఆప్కు సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలిపింది. ఇక బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు మాయావతి తెలిపింది.
ఇది కూడా చదవండి: Ras Kik Coco : రిలయన్స్ ” కిక్” ఇచ్చే కూల్ డ్రింక్.. టాటాకు పోటీగా..!
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!