Delhi : 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించగా, అసెంబ్లీ స్పీకర్ పదవికి విజేంద్ర గుప్తా పేరును ఖరారు చేశారు.
Anna Hazare: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్తో సహా కీలక నేతలైన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి వారు ఓటమి పాలయ్యారు. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజరే స్పందించారు. కేజ్రీవాల్ని విమర్శించారు. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారేతో పాటు కేజ్రీవాల్ పాల్గొన్నారు. Read Also: CM Chandrababu: ఈ నెల 10…
Delhi Liquor Scam: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కౌంటింగ్లో కనిపించాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆప్ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సోమనాథ్ భారతి వంటి కీలక నేతలు ఓడిపోయారు.
Parvesh Varma: ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అగ్రనేతల్ని ఓడించి మరీ ఢిల్లీని కైవసం చేసుకుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 చోట్ల బీజేపీ, 22 చోట్ల ఆప్ విజయం దాదాపు గా ఖరారైంది.
Manish Sisodia: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా వెళ్తోంది. పదేళ్ల పాటు ఢిల్లీని ఏలిన ఆప్ ఘోర పరాజయం పాలవుతోంది. ముఖ్యంగా ఆప్ ప్రధాన నేతలంతా ఓటమి దారిలో ఉన్నారు. ప్రస్తుతం, 70 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఇంటర్నెట్లో మీమ్స్కి కారణమైంది. ఫన్నీ మీమ్స్తో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ పరిస్థితిపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 46, ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఇంటర్నెట్ యూజర్లు అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
AAP: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా వంటి వారితో పాటు ఆ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, సోమ్నాథ్ భారత, సత్యేందర్ జైన్ వంటి వారు వెనకంజలో ఉన్నారు. పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్కి ఈ ఫలితాలు రుచించడం లేదు.
Delhi results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ని ఉడ్చిపడేస్తోంది. గత దశాబ్ధ కాలంగా ఢిల్లీని పాలిస్తున్న అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ ఓటర్లు షాక్ ఇచ్చారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీకి తిరిగి పట్టం కట్టబోతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మధ్యతరతగతి, పూర్వాంచలి ఓటర్లు మద్దతు ఇచ్చారు. గతంలో ఈ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మద్దతుగా నిలిచారు. ఈసారి మాత్రం ఆప్ని యమునలో ముంచారు.
దశాబ్దాల ఘన చరిత్ర. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చామనే పేరు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికిని కోల్పోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. ఆప్ అధికారం చేపట్టే కన్నా ముందు రెండుసార్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం ఆ మెరుపులు మెరిపించలేకపోయింది. వరసగా మూడోసారి కాంగ్రెస్ ‘‘డకౌట్’’ అయింది. ఈ సారి కూడా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్కి ‘‘రిక్త హస్తమే’’ మిగిల్చింది.
AAP: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఈ సారి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. బీజేపీ 47, ఆప్ 22, కాంగ్రెస్ 01 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.