PM Modi: రాహుల్ గాంధీ ‘‘నవాబుల’’ దురాగతాలను మరిచిపోయాడు.. మన మహరాజులను అవమానించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక బెళగావిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిచేందుకు నిషేధిత ‘పీఎఫ్ఐ’ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. మన హిందూ రాజులను అవమానించిందని, ఔరంగజేబు వంటి ముస్లిం రాజుల దురాగతాలపై ఏనాడు నోరు మెదపలేదని ఆదివారం విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్కి చెందిన షెహజాదా( రాహుల్ గాంధీ ) చేసిన ప్రకటన తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి అని ఆరోపించారు. నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్షాలు చేసిన దురాగతాలను, మన వేల దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు దౌర్జన్యాలు కాంగ్రెస్కి గుర్తుండవని, మా తీర్థ క్షేత్రాలను దోచుకున్నారు, ప్రజల్ని చంపారు, ఆవుల్ని వధించారని ప్రధాని అన్నారు. ఇటీవల వైరల్ అయిన రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించారు. ‘‘ రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజులు మరియు మహారాజుల పాలనలో వారు ఏమి చేయగలిగారు, ఎవరి భూమిని కూడా లాక్కోవచ్చు, కాంగ్రెస్, దేశ ప్రజలతో కలిసి స్వాతంత్ర్యం సాధించి ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చింది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: RSS: ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు.. స్పష్టం చేసిన మోహన్ భగవత్..
ఇటీవల హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్ హత్య విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. నేహ లాంటి కూతుళ్ల ప్రాణాలకు విలువ లేదని, కేవలం తమ ఓటు బ్యాంకు గురించి మాత్రమే కాంగ్రెస్ ఆలోచిస్తోందని మండిపడ్డారు. ఇటీవల హుబ్బళ్లిలో నేహా హిరేమత్ని ఫయాజ్ అనే నిందితుడు కాలేజ్ క్యాంపస్లో పొడిచి చంపాడు. కాంగ్రెస్ ఓట్ల కోసం పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)ను ఉపయోగించుకుంటోందని, ఉగ్రవాదనికి ఆశ్రయం ఇచ్చే దేశవ్యతిరేక సంస్థని తమ ప్రభుత్వం నిషేధించిందని, అలాంటి ఉగ్రవాదుల్ని రక్షించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, వయనాడ్లో ఒక్క సీటు గెలుచుకోవడం కోసమే పీఎఫ్ఐ సంస్థతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!