PM Modi: రాహుల్ గాంధీ ‘‘నవాబుల’’ దురాగతాలను మరిచిపోయాడు.. మన మహరాజులను అవమానించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక బెళగావిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిచేందుకు నిషేధిత ‘పీఎఫ్ఐ’ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. మన హిందూ రాజులను అవమానించిందని, ఔరంగజేబు వంటి ముస్లిం రాజుల దురాగతాలపై ఏనాడు నోరు మెదపలేదని ఆదివారం విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్కి చెందిన షెహజాదా( రాహుల్ గాంధీ ) చేసిన ప్రకటన తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి అని ఆరోపించారు. నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్షాలు చేసిన దురాగతాలను, మన వేల దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు దౌర్జన్యాలు కాంగ్రెస్కి గుర్తుండవని, మా తీర్థ క్షేత్రాలను దోచుకున్నారు, ప్రజల్ని చంపారు, ఆవుల్ని వధించారని ప్రధాని అన్నారు. ఇటీవల వైరల్ అయిన రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించారు. ‘‘ రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజులు మరియు మహారాజుల పాలనలో వారు ఏమి చేయగలిగారు, ఎవరి భూమిని కూడా లాక్కోవచ్చు, కాంగ్రెస్, దేశ ప్రజలతో కలిసి స్వాతంత్ర్యం సాధించి ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చింది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: RSS: ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు.. స్పష్టం చేసిన మోహన్ భగవత్..
ఇటీవల హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్ హత్య విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. నేహ లాంటి కూతుళ్ల ప్రాణాలకు విలువ లేదని, కేవలం తమ ఓటు బ్యాంకు గురించి మాత్రమే కాంగ్రెస్ ఆలోచిస్తోందని మండిపడ్డారు. ఇటీవల హుబ్బళ్లిలో నేహా హిరేమత్ని ఫయాజ్ అనే నిందితుడు కాలేజ్ క్యాంపస్లో పొడిచి చంపాడు. కాంగ్రెస్ ఓట్ల కోసం పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)ను ఉపయోగించుకుంటోందని, ఉగ్రవాదనికి ఆశ్రయం ఇచ్చే దేశవ్యతిరేక సంస్థని తమ ప్రభుత్వం నిషేధించిందని, అలాంటి ఉగ్రవాదుల్ని రక్షించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, వయనాడ్లో ఒక్క సీటు గెలుచుకోవడం కోసమే పీఎఫ్ఐ సంస్థతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!