Mallikarjun Kharge-BJP: వీడ్కోలు లేకుండానే ధన్ఖర్ను పంపేశారు.. ఖర్గేకు బీజేపీ కౌంటర్
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి అధ్యక్షత వహించిన రాధాకృష్ణన్
- వీడ్కోలు లేకుండానే ధన్ఖర్ను పంపేశారన్న ఖర్గే
- కాంగ్రెస్ అధ్యక్షుడి భాష గురించి అందరికీ తెలుసని బీజేపీ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ్య ఛైర్మన్గా తొలిసారి సీపీ.రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. గత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ను ఊహించని రీతిలో ఆకస్మికంగా పంపేశారని గుర్తుచేశారు. కనీసం ఆయనకు వీడ్కోలు పలికే అవకాశం కూడా సభకు లభించలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
ఖర్గే వ్యాఖ్యలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. మాజీ ఛైర్మన్ ధన్ఖర్ పట్ల కాంగ్రెస్ ఎలాంటి భాష ఉపయోగించిందో ఎవరూ మరిచిపోరన్నారు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించారో అందరికీ తెలిసిందేనని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. చైర్ గౌరవాన్ని ఎంతగా దెబ్బతీశారో ఒకసారి గుర్తించుకోవాలని హితవు పలికారు. అయినా కొత్త ఛైర్మన్ను అభినందించే సమయంలో పాత విషయాలకు పోవడం భావ్యం కాదని ఖర్గేకు సూచించారు.
ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్ను అభినందించిన మోడీ
అంతకముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు. డిసెంబర్ 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!