Mallikarjun Kharge-BJP: వీడ్కోలు లేకుండానే ధన్ఖర్ను పంపేశారు.. ఖర్గేకు బీజేపీ కౌంటర్
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి అధ్యక్షత వహించిన రాధాకృష్ణన్
- వీడ్కోలు లేకుండానే ధన్ఖర్ను పంపేశారన్న ఖర్గే
- కాంగ్రెస్ అధ్యక్షుడి భాష గురించి అందరికీ తెలుసని బీజేపీ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ్య ఛైర్మన్గా తొలిసారి సీపీ.రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. గత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ను ఊహించని రీతిలో ఆకస్మికంగా పంపేశారని గుర్తుచేశారు. కనీసం ఆయనకు వీడ్కోలు పలికే అవకాశం కూడా సభకు లభించలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ఖర్గే వ్యాఖ్యలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. మాజీ ఛైర్మన్ ధన్ఖర్ పట్ల కాంగ్రెస్ ఎలాంటి భాష ఉపయోగించిందో ఎవరూ మరిచిపోరన్నారు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించారో అందరికీ తెలిసిందేనని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. చైర్ గౌరవాన్ని ఎంతగా దెబ్బతీశారో ఒకసారి గుర్తించుకోవాలని హితవు పలికారు. అయినా కొత్త ఛైర్మన్ను అభినందించే సమయంలో పాత విషయాలకు పోవడం భావ్యం కాదని ఖర్గేకు సూచించారు.
ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్ను అభినందించిన మోడీ
అంతకముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు. డిసెంబర్ 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!